Monthly Archives: October 2018

Beginner’s guide – kainkaryam (Service)

Published by:

SrI:  SrImathE SatakOpAya nama:  SrImathE rAmAnujAya nama:  SrImath varavaramunayE nama:

<< Previous Article

Full Series

parASaran, vyAsan, vEdhavalli and aththuzhAy enter ANdAL PAtti’s house.

ANdAL pAtti: Welcome children. Wash your hands and feet, I will give you fruits offered to perumAL. Did you celebrate ALavandhAr’s thirunakshathram?

parASaran: Yes, We celebrated well. We had good dharSan at ALavandhAr’s sannidhi. There,
they celebrated thirunakshathram in a grand manner. Our father taught us ALavandhAr’s
vAzhi thirunAmam and we also recited the same in our home.

ANdAL pAtti: Very happy to hear.

vEdhavalli: Last time you told us that you will tell the importance of kainkaryam. Do you remember that pAtti?

ANdAL pAtti: Yes, I remember. I am very happy that you remember and you asked me this.
kainkaryam is doing service for emperumAn and his devotees. Our kainkaryam should make
emperumAn happy and please his heart.

vyAsan: If emperumAn will become happy then we are very eager to do kainkaryams to him. How can we do kainkaryams pAtti ?

ANdAL pAtti: We can do kainkaryam with our heart (mAnasIka kainkaryam), our words (vAchika
kainkaryam) and with our body (SarIra kainkaryam). ANdAL nAchchiyAr also said the same
in her thiruppAvai 5th pAsuram that we can sing his glories, think about him and offer
flowers to him. By this way we can please his heart. Thinking about emperumAn’s divine qualities falls under mAnasIka kainkaryam. Praising/singing his divine glories and speaking about emperumAn and his devotees’ greatness, very importantly, reciting AzhwAr’s hymns and pUrvAchAryas’ sthothrams make emperumAn very happy. These kainkaryams fall under vAchika Kainkaryam. Cleaning emperumAn’s temple premises/sannidhi, decorating his premises/sannidhi by drawing kOlams (beautiful shapes), by making garlands, grinding sandal paste for his thiruvArAdhanam etc fall under SarIra kainkaryam. First, we have do possible kainkaryams to emperumAn at our homes. emperumAn happily accepts kainkaryam performed by kids like you.

parASaran: You have explained this very well pAtti. We will happily participate in thiruvArAdhanam performed by our father at our home.

ANdAL pAtti: Good to hear.

aththuzhAy: vEdhavalli and I will participate in drawing kOlam, making garlands etc.

ANdAL pAtti: Very happy to hear aththuzhAy. Another important aspect is, doing kainkaryams to emperumAn’s adiyArs (devotees) is more important than doing kainkaryams to emperumAn. Example, lakshmaNa did all kainkaryams to emperumAn SrI rAma but Sathrugna did kainkaryams to SrI rAmA’s dear brother and devotee bharatha. Also, nammAzhwAr considered his dear krishNa as his food, water and betel leaves/nuts, but madhurakavi AzhwAr considered nammAzhwAr as his only Lord. This emphasises the greatness of emperumAn’s adiyArs. So, we should always be devotees of emperumAn’s adiyArs.

aththuzhAy: As you said, we will definitely give priority to do kainkaryams to emperumAn’s adiyArs. But how do we serve the devotees pAtti?

ANdAL pAtti: When devotees visit our homes, we should offer obeisances to them and make them feel comfortable. We should assist them as necessary. We should also enquire wonderful charithrams about emperumAn, AzhwArs and AchAryas from them and try to learn as much as possible from them. We should humbly ask them if they need any help in their kainkaryams and support them. There are many such ways one can engage in kainkaryams for devotees.

aththuzhAy: Sure pAtti. We get an idea about it now. We will certainly look out for such opportunities.

(Other three kids also say “Yes” in chorus)

ANdAL pAtti: Very happy to hear dear kids.

vEdhavalli: PAtti, It is very interesting to listen your words. Please tell us more.

ANdAL pAtti: I will be very happy to explain more it but now it’s getting very dark outside. Next time, we will discuss another topic. Now, you all should go to your homes.

The children leave happily to their homes thinking about the wonderful conversation they had with ANdAL pAtti.

adiyen sAranAyaki rAmAnuja dAsi

 

బాల పాఠము – ఆళవందార్ల శిష్యులు – భాగము 2

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< ఆళవందార్ల శిష్యులు – భాగము 1

తిరుక్కోష్టియూర్ నంబి, తిరుక్కచ్చి నంబి, మాఱనేరి నంబి

 tirukkachinambi

వ్యాస పరాశర బామ్మగారి ఇంటికి వచ్చారు. వాళ్ళ స్నేహితులు వేదవల్లి, అత్తుళాయ్, శ్రీవత్సాంకన్ తో కలిసి వస్తారు.

నాన్నమ్మ నవ్వుతూ : పిల్లలూ రండి. నిన్న చెప్పినందుకు, మీ స్నేహితులందరినీ తీసుకువచ్చావా?

వ్యాస: అవును నాన్నమ్మా! నేను పరాశర ఇద్దరము రామానుజులు, వారి ఆచార్యుల కథలు శ్రీవత్సాంకన్ కి వినిపించాము. మీ నుండి ఇంకా వినాలని మాతోపాటు వచ్చాడు.

బామ్మగారు: బాగుంది. రండి కూర్చోండి. సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉన్న తిరుక్కచ్చినంబి, తిరుక్కోష్టియూర్ నంబి గురించి ఈ రోజు మీకు చెప్తాను.

శ్రీవత్సాంకన్: నాన్నమ్మా! చెన్నై దగ్గర్లో ఉన్న పూవిరుంతవల్లి అనే ఊర్లో తిరుక్కచ్చి నంబి జన్మించారని తెలుసు. పోయిన సంవత్సరం వేసవి సెలవుల్లో మేము ఆ గుడికి వెళ్ళాము.

బామ్మగారు: బావుంది. వీరు దేవ పెరుమాళ్ళకు తమ వింజామర సేవ, నిత్య సంభాషణకు చాలా ప్రసిద్దులు. దేవ పెరుమాళ్ళకు వీరు ప్రియమైనవారు. రామానుజులు కాంచీపురానికి  వచ్చినప్పుడు, మొట్టమొదటి ఆచార్యులుగా తిరుక్కచ్చి నంబి రామానుజులకు అండగా ఉండి పెరుమాళ్ళ కైంకర్యాన్ని ఇస్తారు.

వ్యాస: రామానుజులు ఏ కైంకర్యాన్ని చేసేవారు, నాన్నమ్మా?

బామ్మగారు: సరైన మార్గం చూపించమని రామానుజులు వీరిని ప్రార్థించారు. తిరుక్కచ్చి నంబి పెరుమాళ్ళ తిరుమంజనం కోసం సాలైక్కిణఱు (దగ్గర్లో ఉన్న ఒక బావి) నుండి జలం పట్టుకువచ్చే కైంకర్యాన్ని రామానుజులకు అప్పగిస్తారు. రామానుజులకు తిరుక్కచ్చి నంబి ఇచ్చిన మొదటి కైంకర్యం ఇది. శాస్త్రం పరిజ్ఞానం, పెరుమాళ్ళపై వీరికున్న భక్తి  ప్రేమలు అపారమైనది. రామానుజులకు తిరుక్కచ్చి నంబి పట్ల భక్తి గౌరవాలు పెరిగి వారి శిష్యుడిగా స్వీకరించి పంచ సంస్కారము చేయమని రామానుజులు ప్రార్థిస్తారు.

పరాశర: కానీ, నాన్నమ్మా, మధురాంతగంలో పెరియనంబి వారు కదా రామానుజులకు పంచ సంస్కారము చేసింది?

బామ్మగారు: అవును పరాశర. నీకు ఇంకా గుర్తుంన్నందుకు సంతోషంగా ఉంది. తిరుక్కచ్చి నంబి శాస్త్ర పండితులు. తాను రామానుజులకు పంచ సంస్కారము చేయడం శాస్త్ర విరుద్ధమని, తాను అర్హులు కారని వారికి బాగా తెలుసు. శాస్త్ర నియమాల పట్ల రామానుజులకు కూడా గౌరవించేవారు. కాబట్టి, తిరుక్కచ్చి నంబి చెప్పిన మాటకు రామానుజులు అంగీకరిస్తారు. శాస్త్ర నియమాలు స్వయంగా పెరుమాళ్ళ సంకల్పాలు అని మనం నమ్మి అనుసరించాలి.

రామానుజులకు మన సాంప్రదాయానికి సంబంధించిన ఏ ప్రశ్నలు, సందేహాలు వచ్చినా తిరుక్కచ్చి నంబి దారి చూపేవారు. రామానుజుల సందేహాలకు జవాబుల కోసం దేవ పెరుమళ్ళతో తిరుక్కచ్చి నంబి సంభాషించే సంఘటనల గూరించి చెప్తాను.

వేదవల్లి : నాన్నమ్మా ఆ సందేహాలు ఏమిటి?

బామ్మగారు:  ఒకానొక సందర్భంలో రామానుజుల మనస్సులో కొన్ని సందేహాలు తలెత్తుతాయి. తిరుక్కచ్చి నంబి దేవ పెరుమాళ్ళతో మాట్లాడతారని తెలుసుకొని, రామానుజులు నంబి సహాయం కోరతారు. నంబి పెరుమాళ్ళ దగ్గరకు వెళ్లి యదావిధిగా తమ వింజామ కైంకర్యం చేస్తూ, రామానుజుల సందేహాల గురించి చెప్పాలని అనుకుంటారు. దేవ పెరుమాళ్ళు గమనించి నంబిని ఏమిటి సంగతని అడుగుతారు. రామానుజులకు కొన్ని సందేహాలు ఉన్నాయని, వాటికి సమాధానాలు కోరుతున్నారని అంటారు. నంబికి ఆ సందేహాలు ఏమిటో తెలియదు కాని, అందరి అంతర్యామియైన దేవ పెరుమాళ్ళు, ఇలా అంటారు, “రామానుజులకు చెప్పండి 1) నేను సర్వోత్తముడను 2) సమస్థ చేతనాచేతనులలో అంతర్యామిగా ఉంటున్నాను కాని వారు నాకు సమానులు కారు, నాకు అధీనులై ఉంటారు. 3) నన్ను చేరుకోడానికి నన్ను ఆశ్రయించడమే ఏకైక మార్గం. 4) శరణాగరులైన వారిని వాళ్ళ అంతిమ సమయమున నేను వారిని స్మరించి వాళ్ళ యోగక్షేమాలను నేనే చూసుకుంటాను 5) నా భక్తులు ఈ సంసారాన్ని విడిచిపెట్టిన తరువాత ఆళ్ళకి శాశ్వతముగా శ్రీ వైకుంటంలో కైంకర్యాన్ని ప్రసాదిస్తాను. చివరిగా 6) రామానుజులు పెరియ నంబులను ఆచార్యులుగా స్వీకరించాలి అని దేవ పెరుమాళ్ళు సమాధాననిస్తాడు. రామానుజుల సందేహాలు ఏమిటని దేవపెరుమాళ్ళు అడగలేదు, నంబికి కూడా ఆ సందేహాలు ఏమిటో తెలియదు. ఈ సమాధానాలతో నంబి తిరిగి రామానుజుల దగ్గరకు వెళ్లినప్పుడు, రామానుజుల ఆనందానికి అంతు లేదు. దేవ పెరుమాళ్ళ కృప అలా ఉండేది. రామానుజులకు రకమైన భయంగాని సందేహాలు కాని తలెత్తినప్పుడు సదా పెరుమాళ్ళు తోడు ఉండేవారు. ఇప్పుడు రామానుజులు పంచ సంస్కారము కోసం పెరియనంబులను ఆశ్రయించాలన్న మాట స్పష్టమైనది. తిరుక్కచ్చి నంబి ఆశీర్వాదాలను తీసుకొని, పెరియనంబులను కలుసుకోవడానికి శ్రీరంగానికి బయలుదేరుతారు. తరువాత మిగిలిన కథ మనందరికీ తెలుసిందే.

వ్యాస: అవును నాన్నమ్మా, మాకు గుర్తుంది.

బామ్మగారు: శ్రీవైష్ణవులకు ఉండవలసిన లక్షణాలలో ముఖ్యమైన వినయం. దీనిని తరచూ నైచ్య భావంగా పిలుస్తుంటారు.  వినయం విషయానికి వస్తే పెరియనంబి వారు ఒక సజీవ ఉదాహరణగా భావించాలి. వారికి ఆ స్వభావం స్వాభావికంగా వచ్చినది. పెరియనంబి వారు ఇతర శ్రీవైష్ణవులను ఎప్పుడూ ఆదరించి గౌరవించేవారు. ఒక ఆసక్తికరమైన సంఘటన ఈ విషయాన్ని నిరూపిస్తుంది. పెరియనంబి లాగానే ఆళవందార్ల శిష్యులలో మాఱనేరి నంబి (పంచమ కులస్థుడు) అనే ఒక  గొప్ప ఆచార్యులు ఉండేవారు. మాఱనేరి నంబి తమ చరమ కర్మలు ఒక శ్రీవైష్ణవుని హస్తాలతో చేయించుకోవాలని ఆశించి, ఆ కార్యాన్ని పెరియ నంబి వారిని అప్పగిస్తారు. పెరియ నంబి సంతోషంగా అంగీకరిస్తారు. కాని పెరియ నంబి తక్కువ జాతి వ్యక్తికి చరమ కర్మలు చేసారని, శాస్త్ర విరుద్ధమైన కార్యము చేశారని గ్రామస్థులు కోపంతో అడిగినప్పుడు, పెరియనంబి వారు భాగవత కైంకర్యమే గొప్పదని పవిత్రమైనదన్న నమ్మాళ్వార్ల ఉపదేశాలనే తాను అనుసరిస్తున్నారని చెప్తారు. భాగవతులను  కులమాధారంగానో జన్మాధారంగానో భేదం చూపకుండా గౌరవించాలని అంటారు. నైచ్య భావ సిద్ధాంతమును పెరియ నంబి ఆచరించి చూపించారు. ప్రతి భాగవతుడు భగవంతునికి  ప్రియమైనవాడే, అందరినీ ఆదరించి గౌరవించాలని వారు నమ్మేవారు. నిజమైన భగవత్ భక్తుడు తమ చివరి క్షణాలను ఎలా గడిపినా, తిరుక్కచ్చి నంబికి దేవపెరుమళ్ళు ఇచ్చిన మాట ప్రకారం భగవానుడు వారికి బ్రహ్మానందమైన శ్రీ వైకుంటంలో శాశ్వత కైంకర్యాన్ని ప్రసాదిస్తారు. వీరు జీవితమంతా తమ ఆచార్యులైన ఆళవందార్లు, నమ్మాళ్వార్ల ఉపదేశాలను ఆచరిస్తూ గడిపారు.

పిల్లలూ ఈవాలిటికి ఇక చాలా లేదా మీరు తిరుక్కోష్టియూర్ నంబి గురించి కూడా వింటారా?

azhwar-acharyas-ramanuja

వేదవల్లి: మీకు వారి కథలు కూడా  తెలుసా నాన్నమ్మా?

బామ్మగారు: అవును, వేదవల్లి!

అత్తుళాయ్: అయితే మీరు తిరుక్కోష్టియూర్ నంబి గురించి కూడా ఈవాళే చెప్పండి.

బామ్మగారు:  తిరుక్కోష్టియూర్ నంబి కూడా ఆళవందార్ల ముఖ్య శిష్యులలో ఒకరు. రామానుజులకు తిరుమంత్రం, చరమ శ్లోకార్థాలను నేర్పించే బాధ్యత వీరికి అప్పగించబడింది. మీకు తెలుసా అవి ఏమిటో?

వ్యాస: ‘ఓం నమో నారాయణాయ’ ను తిరుమంత్రం అని పిలుస్తారు.

శ్రీవత్సాంకన్:  ‘సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ; అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాశుచః’ అని చరమ శ్లోకాన్ని పిలుస్తారు.

బామ్మగారు:  చాలా బాగుంది. ఈ మూడు శ్లోకాలకు చాలా లోతైన అర్థాలున్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఆచార్యుల నుండి వీటి అర్థాలను నేర్చుకోవాలి.

వేదవల్లి: కానీ నాన్నమ్మా, మాకు ఈ శ్లోకాల అర్థాలు తెలుసు.

బామ్మగారు: అవును, మనలో చాలా మందికి ఈ శ్లోకాల పైతేట అర్థం కొంతవరకు తెలుసు. కానీ సాంప్రదాయం ప్రకారం ఈ మూడు శ్లోకాలు చాలా లోతైన అర్థాలతో కూడినవి. మన ఆచార్యుల అనుగ్రహం లేకుండా తెలిసుకోవడం మన సామర్థ్యానికి మించిన పని. అందుకని ఈ శ్లోకార్ధాలను రామానుజులకు నేర్పించే ముఖ్యమైన బాధ్యత తిరుక్కోష్టియూర్ నంబికి అప్పగించబడింది.

అత్తుళాయ్: నాన్నమ్మా! ఈ విషయంలో తిరుక్కోష్టియూర్ నంబి దగ్గరికి రామానుజులు 18 సార్లు వెళ్ళవలసి వచ్చిందని నేను విన్నాను. ఇది నిజమా? ఎందుకని అలా ఇబ్బందిపడాల్సి వచ్చింది?

బామ్మగారు: అవును, ఇది నిజం. మన సాంప్రదాయం గురించి తెలుసుకోవడంలో రామానుజులకు ఉన్న నిజాయితీ నిష్ఠను పరీక్షించడానికి తిరుక్కోష్టియూర్ నాంబి పెట్టిన పరీక్ష అని మనం అనుకోవచ్చు. ఇది రామానుజులకున్న పట్టుదలను, సహనాన్ని దర్శిస్తుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనము ధైర్యంగా ఎదుర్కోవాలి, సహనం కోల్పోకూడదు. రామానుజులు ఎన్నిసార్లు వెళ్ళరో చూడండి. 18 సార్లు! చివరకు 18వ సారి తిరుక్కోష్టియూర్ నంబి చరమ శ్లోకార్థాన్ని రామానుజులకు బోధిస్తారు.

వ్యాస: నాన్నమ్మా, తిరుక్కోష్టియూర్ నంబి చాలా నిష్కర్షమైన వారిలా ఉన్నట్టున్నారు. రామానుజులపైన కొంచం జాలి చూపించాల్సింది.

బామ్మగారు: ఈ సంఘటన గురించి విన్న వారందరూ ఇదే మాట అంటారు. కానీ ఇది నిజం కాదు. వీరు ఎప్పుడూ మనస్సులో రామానుజుల యోగక్షేమాలు కోరుతూ ఉండేవారు. బయటికి ఒక తండ్రిలా కఠినంగా అనిపించినా, కొడుకు యోగక్షేమాల కోసం ఎలాంటి త్యాగమైనా చేయడానికి సిద్ధంగా ఉండేవారు. నిన్న మీకు తిరుమాలై ఆండాన్ గురించి చెప్పాను గుర్తుందా?  తిరుమాలై ఆండాన్ రామానుజుల మధ్య కొన్ని అభిప్రాయాల భేదాలు ఉండేవని చెప్పాను?తిరుక్కోష్టియూర్ నంబి వీరిరువుల మధ్య మధ్యవర్తిగా ఉండి వివాదాన్ని పరిష్కరిస్తారు. వాస్తవానికి, శ్రీ వైష్ణవుల పట్ల రామానుజులకున్న నిస్వార్ధ ప్రేమ తిరుక్కోష్టియూర్ నంబిని ఎంతో ఆకట్టుకుంటుంది. వీరే రామానుజులకు ఎంబెరుమానార్ అనే బిరుదాన్ని (ఎంబెరుమాన్ కంటే ఉన్నతమైనవాడు అని అర్థం) ప్రసాదిస్తారు. ఈ విధంగా ఆ అందమైన పేరు “ఎంబెరుమానార్” అని రామానుజులకు వచ్చింది. శ్రీరంగంలో కొంతమంది దుష్టులు రామానుజులకు విషాన్ని ఇస్తారు. వెంటనే తిరుక్కోష్టియూర్ నంబి సమయానికి వచ్చి, రామానుజుల కోసం వంట చేయడానికి కిడాంబి ఆచ్చాన్ ను నియమిస్తారు. తిరుక్కోష్టియూర్ నాంబి ఒక తండ్రి వలె ఎప్పుడూ రామానుజుల యోగక్షేమాలను గమనిస్తూ ఉండేవారు. వీరి మహిమను, జ్ఞానాన్ని, ఆళవందార్ల పట్ల వీరికున్న ఆచార్యభక్తిని చూపుటకు ఎన్నో కథలు ఉన్నాయి. మీకు ఆ కథలను చెప్పాలని ఎంతో ఇష్టంగా ఉంది. మీకూ వినాలని ఉంది అని అనుకుంటున్నాను. కాని, మీకాలస్యం అవుతుంది. మీరు ఈ పండ్లను తీసుకొని ఇంటికి వెళ్లండి. ఇంకొక సారి, మన ఆచార్యుల గురించిన కథలను మీకు చెప్తాను.

పిల్లలు పండ్లు పంచుకుంటూ తిరుక్కచ్చి నంబి, పెరియ నంబి, తిరుక్కోష్టియూర్ నంబి గురించి ఆలోచించుకుంటూ ఇంటికి వెళతారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2016/08/beginners-guide-alavandhars-sishyas-2/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

श्रीवैष्णव – बालपाठ – श्री रामानुजाचार्य स्वामीजी – भाग 1

Published by:

श्री: श्रीमते शठकोपाय नमः  श्रीमते रामानुजाय नमः  श्रीमद्वरवरमुनये नमः

बालपाठ

<< आळवन्दार् शिष्य – भाग 2

पराशर, व्यास ने अंडाल दादी के घर में वेदवल्ली और अथथुले के साथ प्रवेश किया।

दादी : स्वागत बच्चों | अपने हाथ और पैर धो लो। थिरुआदिप पुरम उत्सव त्यौहार का प्रसाद यहां है, यह हमारे मंदिर में हुआ था। आज, हम अंडल पिराट्टी से बहुत प्रिय किसी पर अपनी चर्चा शुरू करेंगे, जिसे वह अपने भाई के रूप में बुलाती है। क्या आप अनुमान लगा सकते हैं कि यह कौन है ?

व्यास : नहीं दादी , अंडाल जी के भाई कौन थे ? क्या अंडाल जी का कोई भाई भी था ?

दादी : हाँ, वह उसका भाई था, जन्म से नहीं बल्कि प्यार और स्नेह से। उन्हें गोदाग्रज या कोयिल अन्नन कहा जाता था, जो हमारे रामानुजर के अलावा कोई नहीं है! अग्रजन का अर्थ संस्कृत में बड़े भाई होता है । गोदा जी द्वारा उनको बड़ा भाई मानना, इसीलिए उनको गोदाग्रज कहते है| स्वयं श्रीअनन्तशेष के अवतार, भगवत रामानुज स्वामीजी के पिता श्री केशवदीक्षितार और माता श्रीमती कान्तिमति देवी थी । भगवत रामानुज स्वामीजी का जन्म दक्षिणात्य चैत्र मास के आर्द्रा नक्षत्र के दिन वर्तमान तमिलनाडु के श्रीपेरुम्बुदुर नामक गांव में हुआ। श्रीपेरूंबुदूर मैं श्री तिरुवल्लिक्केणि के श्री पार्थसारथी भगवान के अंशावतार के रूप मैं जन्म हुआ ।

पाराशर : दादी, क्या गोदा जी का अवतरण रामानुज स्वामीजी से पहले नहीं हुआ था? फिर रामानुज स्वामीजी गोदा जी के बड़े भाई कैसे हुए ?

दादी : पाराशर, बहुत अच्छा प्रश्न है | जैसे मैंने कहा था, रामानुज स्वामीजी गोदा जी के जन्म से भाई नहीं थे बल्कि अपने कर्मो के द्वारा उनके भाई थे | अंडाल, भगवान जी के प्रति उनका प्रेम स्नेह बहुत था, इसीलिए उनकी इच्छा थी की, भगवान सुन्दरबाहु ( तिरुमालिरुन्सोलै) को १०० घड़े अक्कर वडिसल और १०० घड़े मक्खन का भोग लगाए | लेकिन उस समय गोदा जी बाल्या अवस्था में होने से अपनी इच्छा पूरी नहीं कर सकी | रामानुज स्वामीजी नाच्चियार थिरुमोलही पाशुरम का पाठ करते है जहाँ गोदा जी अपनी इच्छा को पूरा करने की इच्छा प्रकट करती है | फिर रामानुज स्वामीजी १०० घड़े अक्कर वडिसल और १०० घड़े मक्खन का भोग भगवान सुन्दरबाहु ( तिरुमालिरुन्सोलै) को गोदाजी की और से लगाते है | भगवान जी को भोग लगाने के बाद रामानुज स्वामीजी जब श्रीविल्लिपुत्तूर जाते है और श्रीविल्लिपुत्तूर पहुँच कर, गोदाजी उनका अभिनन्दन करती है और उनको अपना श्रीरंगम से बड़ा भाई बोल कर संबोधित करती है, इसीलिए रामानुज स्वामीजी का एक नाम कोयिल अन्नन है | गोदाजी रामानुज स्वामीजी को बड़ा भाई इसीलिए कह कर संबोधित करती है क्यूँकि भाई वह होता है जो बहन का ध्यान रखे और अपनी बहन की इच्छा और मनोरथ पूर्ण करे |

अतुलाय, क्या आप तिरुप्पावै के पाशुरम का उच्चारण कर सकते हो ? मुझे स्मरण है की आप स्कूल बहुरूप पोशाक प्रतियोगिता में अभिनीत किया था और कुछ पाशुरम का उच्चारण भी किया था ?

(फिर अतुलाय कुछ पाशुरम का उच्चारण करती है )

दादी : क्या आप जानते है की मैंने क्यों आपको आज उच्चारण के लिए कहा था ? क्योंकि, रामानुज स्वामीजी को भी तिरुप्पावै जीयर के नाम से जाना जाता है | रामानुज स्वामीजी सदैव प्रतिदिन तिरुप्पावै का उच्चारण करते थे | महान विद्वान होने के बाबजूद भी, रामानुज स्वामीजी तिरुप्पावै को अपने मन के पास थी और उसका प्रतिदिन उच्चारण करते थे | क्या आपको मालूम है क्यों ?

वेदावल्ली : इसीलिए यह सिखने में सरल है ? मुझे सभी ३० पाशुरम आते है |

दादी (मुस्कराते हुए ) : वेदावल्ली, यह तो बहुत अच्छा है | तिररुप्पवाई सीखना सरल ही नहीं, परन्तु ३० पाशुरम में हमारे संप्रदाय का सार है | तिरुप्पावै का ज्ञान वेदो में जो ज्ञान है उसके समान है | इसीलिए इसको “वेदं अनैतत्तुक्कुम विठ्ठागुम” —- ३० पाशुरम में सर्व वेदो का सार निहित है |

अतुलाय : दादी, रामानुज स्वामीजी के तो बहुत सारे नाम थे | पहले अपने इळयाळ्वार कहा, फिर रामानुज, और अब कोयिल अन्नन और तिरुप्पावै जीयर |

दादी : हाँ | उनके यह सब नाम हमारे सम्प्रदाय के आचार्यो ने, गोदा जी ने और भगवान जी ने स्नेह पूर्वक दिए | हमने रामानुज स्वामीजी के सभी आचार्यो के बारे में जाना और उनका रामानुज स्वामीजी के जीवन में योगदान जो उन्होंने दिया | चलिए रामानुज स्वामीजी के विभिन्न प्रकार के नाम देखते है और देखे की यह नाम उनको किस किस ने दिए है |

उनमे कुछ नाम इस प्रकार है,

१) इळयाळ्वार – यह नाम रामानुज स्वामीजी के मामाजी, पेरिय तिरुमलै नम्बि (श्रीशैलपूर्ण स्वामीजी) ने उनके नामकरण के दिन दिये थे ।

२) श्रीरामानुज – उनके आचार्य श्रीपेरियनम्बि(श्री महापूर्ण स्वामीजी) ने दीक्षा के समय दिये थे।

३) यतिराज और रामानुज मुनि – श्री देवपेरुमाळ (भगवान वरदराज, कांची) ने उनके सन्यास दीक्षा के समय दिये थे।

४) उडयवर – नम्पेरुमाळ (भगवान रंगनाथ, श्रीरंगम ) ने दिया था।

५) लक्ष्मण मुनि – तिरुवरंगपेरुमाळ अरयर(श्री वाररंगाचार्य स्वामीजी) ने दिया था।

६) एम्पेरुमानार – जब श्रीरामानुजाचार्य ने गुरु से प्राप्त मन्त्र वहां उपस्थित सारे लोगों को बिना पूछे ही बतला दिया था तब श्री तिरुक्कोष्टियूर नम्बि(श्री गोष्टिपुर्ण स्वामीजी) ने यह नाम दिया था ।

७) शठगोपनपोन्नडि (शठकोप स्वामीजी की पादुका) – तिरुमलय अण्डाण(श्री मालाकार स्वामीजी) ने दिया था ।

८) कोयिल अन्नन – भगवान सुन्दरबाहु ( तिरुमालिरुन्सोलै) को १०० घड़े अक्कर वडिसल और १०० घड़े मक्खन का भोग लगाकर जब श्रीरामानुजाचार्य स्वामीजी ने माँ गोदाम्बाजी का प्रण पुरा करके, श्रीविल्लिपुत्तूर दर्शन के लिए आये तब माँ गोदाम्बजी ने दिया था।

९) श्रीभाष्यकार – कश्मीर में शारदा पीठ में श्रीभाष्य पर रामानुज स्वामीजी के विवेचन पर प्रसन्न हो सरस्वती देवी ने प्रदान किया था।

१०) भूतपूरीश्वर – श्रीपेरुम्पुदुर के श्रीआदिकेशव भगवान ने दिया था।

११) देषिकेन्द्रार – श्रीतिरुवेण्कटमुदयन(श्री वेंकटेश भगवान) ने यह नाम प्रदान किये थे ।

इस तरह से, यह संक्षेप में वह सब नाम है जो रामानुज स्वामीजी को बहुत सारे आचार्यो ने प्रदान किये जिन्होंने रामानुज स्वामीजी का ध्यान रखा और उनका ज्ञान संवर्धन किया ताकि हमारा सम्प्रदाय और बढ़ सके और आलवन्दार स्वामीजी के बाद रामानुज स्वामीजी इसको आगे ले जा सके | आळवन्दार् (श्री यामुनाचार्य स्वामीजी) के विशेष अनुग्रह के द्वारा उनको सबसे पहले तिरुक्काच्चिनम्बि (श्री काँचीपूर्ण स्वामीजी) से श्रीवैष्णव सम्प्रदाय के बारे में बतलाते है, बाद में श्री पेरियनम्बि(श्री महापूर्ण स्वामीजी), इळयाळ्वार को पंचसंस्कार दीक्षा प्रदान करते हैं, तिरुवायमोली का अनुसंधान थिरुमलाई अण्डाण जी से सीखते है, हमारे सम्प्रदाय का सार थिरुवरंगपेरुमल अरैयर जी से सीखते है, तिरुक्कोष्टियुरनम्बि (गोष्ठिपूर्ण स्वामीजी) से श्रीसम्प्रदाय के गोपनीय मंत्र सीखते है एवं रामायण का सार और उनके श्लोको का सुन्दर वर्णन अपने मामाजी पेरिया थिरुमलाई नम्बि जी से सीखते है | इस प्रकार, आळवन्दार् (श्री यामुनाचार्य स्वामीजी) के ६ मुख्या शिष्यों ने अपने गुरूजी के प्रति अपनी सेवा कैंकर्य किये |

रामानुज स्वामीजी – श्री पेरुम्बुदूर

वेदावल्ली : दादी, जब आप आळवन्दार् (श्री यामुनाचार्य स्वामीजी) के बारे में बता रही थी, अपने कहा था रामानुज स्वामीजी आळवन्दार् (श्री यामुनाचार्य स्वामीजी) के शिष्य नहीं बन सके पर रामानुज स्वामीजी ने प्रण लिए था की वह आळवन्दार् (श्री यामुनाचार्य स्वामीजी) के मनोरथो की पूर्ति करेंगे | वह क्या थी ? रामानुज स्वामीजी को कैसे पता चला की आळवन्दार् (श्री यामुनाचार्य स्वामीजी) के क्या अभिलाषाएँ थी |

दादी : एक बहुत सुन्दर प्रश्न है | जब आळवन्दार् (श्री यामुनाचार्य स्वामीजी) ने पेरिया नम्बि स्वामीजी को रामानुज स्वामीजी को श्री रंगम में लाने आज्ञा दिए, तो पेरिया नम्बि स्वामीजी कांचीपुरम जाते है | जब तक पेरिया नम्बि स्वामीजी रामानुज स्वामीजी के साथ श्री रंगम से लौट कर आते है, तब तक आळवन्दार् (श्री यामुनाचार्य स्वामीजी) वैकुण्ठ गमन कर इस संसार को छोड़ देते है| श्री रंगम पहुंचने पर, पेरिया नम्बि स्वामीजी और रामानुज स्वामीजी को जब इसके बारे में पता चलता है | जब रामानुज स्वामीजी आळवन्दार् (श्री यामुनाचार्य स्वामीजी) का दिव्या रूप देखे, उन्होंने उनके एक हाथ की ३ उंगलिया मुड़ी हुयी (बंद) देख अचंभित होते हैं। इळयाळ्वार् भी यह देख उपस्थित शिष्य और वैष्णव समूह से चर्चा कर इसका कारण जानने का प्रयास करते है , सबकी सुन इस निर्णय पर पहुँचते है की आलवन्दार स्वामी की ३ इच्छाएँ अपूर्ण रह गयी , रामानुज स्वामीजी उसी समय प्रण लेते है की वह आळवन्दार् (श्री यामुनाचार्य स्वामीजी) इच्छाएँ पुराण करेंगे | वे इच्छाएँ इस प्रकार थी, :
१. व्यास और पराशर ॠशियों के प्रति सम्मान व्यक्त करना ।
२. नम्माल्वार् के प्रति अपना प्रेम बढ़ाना ।
३. विशिष्टा द्वैत सिद्धान्त के अनुसार व्यास के ब्रह्म सूत्र पर श्रीभाष्य की रचना करना (विश्लेष से विचार/चर्चा करना ) लिखना । श्रीभाष्य टिका (व्याख्या) हेतु श्री कूरत्ताळ्वान के साथ कश्मीर यात्रा पर जाते है, बोधायनवृत्ति ग्रन्थ प्राप्त कर श्री बादरायण के ब्रह्मसूत्रों पर टिप्पणि पूरी करते है |

तब इळयाळ्वार् प्रण लेते है की, आलवन्दार स्वामी के यह ३ इच्छाएँ वह पूर्ण करेंगे, इळयाळ्वार् के प्रण लेते ही आळवन्दार् स्वामी की तीनो उंगलिया सीधी हो जाती हैं । यह देखकर वहां एकत्रित सभी वैष्णव, और आलवन्दार स्वामी के शिष्य अचंभित हो खुश हो जाते हैं और इळयाळ्वार् की प्रशंसा करते हैं। आळवन्दार् स्वामी की परिपूर्ण दया, कृपा कटाक्ष और शक्ति उन पर प्रवाहित होती हैं। उन्हें श्री वैष्णव संप्रदाय दर्शन के उत्तराधिकारी पद पर प्रवर्तक/ निरवाहक चुन लिये जाते हैं । इळयाळ्वार् को आळवन्दार् स्वामी का दर्शन का सौभाग्य प्राप्त न होने का बहुत क्षोभ हुआ, वे दुखित मन से सब कैंकर्य पूर्ण करके , बिना पेरिय पेरुमाळ् के दर्शन किये कान्चिपूर् लौट जाते हैं ।

व्यास : लेकिन दादी, किसी का शरीर ऐसे कैसे उत्तर दे सकता है जैसे की आळवन्दार् (श्री यामुनाचार्य स्वामीजी) की मुड़ी हुयी उंगलिया रामानुज स्वामीजी की प्रतिज्ञा सुन कर ?

दादी : व्यास, जो संबंध रामानुज स्वामीजी का और आळवन्दार् (श्री यामुनाचार्य स्वामीजी) था वह शारीरिक अनुभव से बहार थी | यह संबंध ऐसे था जैसे मन और आत्मा का संबंध जैसा | क्या आळवन्दार् (श्री यामुनाचार्य स्वामीजी) ने रामानुज स्वामीजी को अपनी अंतिम ३ इच्छाएँ बताई थी ? यह कैसे हो सकता है ? व्यास, इस प्रकार का संबंध होता है | ठीक उस प्रसंग की तरह जहाँ वरदराज भगवान जी रामानुज स्वामीजी की शंकाओं का समाधान करते है बिना रामानुज स्वामीजी के बताये की उनकी शंकाएँ क्या है | ऐसे संबंध मन और आत्मा से सम्पन होते है और न की शरीर के द्वारा | इस तरह का संबंध था रामानुज स्वामीजी का और आळवन्दार् (श्री यामुनाचार्य स्वामीजी) का |

अब तक हमने रामानुज स्वामीजी और विभिन्न आचार्यो ने जो उनके जीवन से संबंध रखते थे, वह सब देखा | में आपको कल वह सब बताउंगी की कैसे रामानुज स्वामीजी एक महान आचार्य बने और कैसे बहुत से शिष्यों ने रामानुज स्वामीजी के जीवन में उनका अनुसरण किया |

अडियेन् रोमेश चंदर रामानुजन दासन

आधार – http://pillai.koyil.org/index.php/2016/08/beginners-guide-ramanujar-1/

प्रमेय (लक्ष्य) – http://koyil.org
प्रमाण (शास्त्र) – http://granthams.koyil.org
प्रमाता (आचार्य) – http://acharyas.koyil.org
श्रीवैष्णव शिक्षा/बालकों का पोर्टल – http://pillai.koyil.org

 

బాల పాఠము – ఆళవందార్ల శిష్యులు – భాగము 1

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< పెరియ నంబి

తిరువరంగప్పెరుమాళ్ అరైయర్, పెరియ తిరుమలై నంబి, తిరుమాలై ఆండాన్

pancha-acharyas

ఆలవందార్ల శిష్యులు

వ్యాస పరాశరులు వాళ్ళ స్నేహితురాలు వేదవల్లితో బామ్మగారి ఇంటికి వచ్చారు.

బామ్మగారు: పిల్లలూ లోపలికి రండి.

వ్యాస: నాన్నమ్మా, పోయిన సారి మీరు రామానుజులు, వారి ఆచార్యుల గురించి చెప్తానని అన్నారు.

పరాశర: నాన్నమ్మా, రామానుజులకు కేవలం పెరియనంబులు మాత్రమే కాదు అనేక మంది ఆచార్యులు ఉన్నారని చెప్పారు కదా? వాళ్ళు ఎవరు నాన్నమ్మా?

బామ్మగారు: పిల్లలూ! క్రిందటి సారి మీకు చెప్పాను గుర్తుందా. ఆళవందార్లకు అనేక శిష్యులుండేవారని, వాళ్ళందరూ ఇళైయాళ్వార్లను మన సాంప్రదాయంలోకి తీసుకురావడానికి కృషి చేసారని చెప్పాను. వాళ్ళల్లో ముఖ్యమైనవారు 1) తిరువరంగ ప్పెరుమాళ్ అరైయర్ 2) తిరుక్కొష్టియూర్ నంబి 3) పెరియ తిరుమలై నంబి 4) తిరుమాలై ఆండాన్ 5) తిరుక్కచ్చి నంబి, పెరియ నంబి. మనము పెరియనంనుల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు, ఇతర ఆచార్యుల గురించి, వాళ్ళు సాంప్రదాయానికి చేసిన విలువైన సేవల గురించి చెప్పుకుందాం.

పరాశర: నాన్నమ్మా, రామానుజులకు అంత మంది ఆచార్యులు ఎందుకున్నారు?

బామ్మగారు: వాళ్ళందరూ తమ తమ శైలిలో రామానుజులను గొప్ప ఆచార్యుడిగా తీర్చిదిద్దడంలో తోడ్పడ్డారు. తిరువరంగ ప్పెరుమాళ్ రామానుజులను కాంచీపురం నుండి శ్రీరంగానికి తీసుకొని వచ్చి గొప్ప కైంకర్యం చేశారు.

వ్యాస: అది ఎలా జరిగింది? ఆ కథ చెప్పండి నాన్నమ్మా.

బామ్మగారు:  రామానుజులు సమాశ్రయనం చేసుకొని కాంచీపురంలో జీవిస్తున్న రోజులవి. అప్పట్లో ఒక అరైయర్ స్వామి కంచికి వెళ్లి దేవపెరుమాళ్ళ ఎదుట అరైయర్ సేవ చేయటానికి తిరుక్కచ్చి నంబిని ప్రార్థిస్తారు. అర్చకముఖేన దేవపెరుమాళ్ళు అరైయర్ సేవకి అనుమతిని ప్రసాదిస్తారు. ఆ అరైయర్ స్వామి ఎంతో ప్రేమభక్తితో పాశురాలను పాడి ఆడతారు. పెరుమాళ్ళు ఎంతో సంతోషించి అరైయర్ స్వామికి బహుమానాలను ప్రసాదిస్తారు. కాని అరైయర్ స్వామి తనకి ఆ బహుమతులు కాకుండా ఇంకేదో కావాలని ప్రార్థిస్తారు. పెరుమాళ్ళు అంగీకరించి “ఏమి కావాలో కోరుకో” అని అంటారు. అరైయర్ స్వామి రామానుజులను చూపించి, వారిని శ్రీరంగానికి పంపించమని కోరతారు. “నీవు రామానుజులను పంపమని అనుకోలేదు; ఇంకేమైనా అడుగు” అని దేవ పెరుమాళ్ళంటారు. అరైయర్ స్వామి బదులిస్తూ “మీరు ఎవరో కాదు ఒకే మాట ఒకే బాణం ఉన్న సాక్షాత్తూ ఆ శ్రీ రాముడే – ఇక మాట తప్పలేరు”. దేవపెరుమాళ్ళు అంగీకరించి రామానుజులను అరైయర్ స్వామితో పంపుతారు.

వ్యాస: ఎంత చమత్కారంగా నాన్నమ్మా? అరైయర్ స్వామి ఎంత తెలివిగా పెరుమాళ్ళనును ఒప్పించారు.

బామ్మగారు: అవును వ్యాస. అరైయర్ స్వామి వెంటనే రామానుజుల చేయి పట్టుకుని శ్రీరంగానికి బయలుదేరుతారు. రామానుజులను శ్రీరంగానికి తీసుకువచ్చి అరైయర్ శ్రీవైష్ణవులకు అతిముఖ్యమైన సేవ చేసారు. మన సాంప్రదాయాన్ని ఉన్నత స్థాయికి చేరుకునేందుకు తోడ్పడ్డారు.

వేదవల్లి: నాన్నమ్మా, ఒక్కొక్క ఆచార్యుడు ఒక్కొక్క విధంగా రామానుజులను తీర్చిదిద్దారన్నారు. అరైయర్ ఏమి బోధించారు నాన్నమ్మా?

బామ్మగారు: సాంప్రదాయ విషయాలను రామానుజులకు బోధించమని ఆళవందార్లు తమ ప్రముఖ శిష్యులకు ఆదేశన్నిచ్చి వారు పరమపదానికి చేరుకుంటారు. రామానుజులకు సాంప్రదాయ సారాన్ని బోధించమని అరైయర్కు అప్పగిస్తారు. రామానుజులు జ్ఞానం కోసం అరైయర్ వద్దకు వెళ్లే ముందు, ఆరు నెలల పాటు ఆచార్యులకు (అరైయర్) కైంకర్యం చేస్తారు. ఇది గమనించాల్సిన ముఖ్యమైన విషయం. రామానుజులు, కూరత్తాల్వాన్లు, ముదలియాండాన్, ఇంకా అనేక ఆచార్యులు వారి జీవితాల్లో జ్ఞాన ప్రసాదం తీసుకునే ముందు ఆచార్యులకు కొంతకాలం ఈవిధంగా సేవ చేసేవాళ్ళు. ఇది వాళ్ళు పొందే జ్ఞానం పట్ల, ఆ జ్ఞానాన్ని ప్రసాదించేవారి పట్ల వాళ్ళకున్న భక్తిని చూపిస్తుంది. రామానుజులు అరియార్ స్వామి కోసం ప్రతిరోజూ పాలు కాచేవారు. తమ ఆచార్యుని కోసం చందనాన్ని నూరి సిద్ధం చేసేవారు.

వ్యాస: నాన్నమ్మా, ఇతర ఆచార్యులు రామానుజులకు ఏమి బోధించారు?

బామ్మగారు: వస్తున్నా! నేను ఒకరి తరువాత ఒకరు వాళ్ళ వద్దకే వస్తున్నాను. తిరుమలై నంబి రామానుజులకు స్వయానా మేన మామగారు. వీరు శ్రీవైష్ణవ అగ్రేసరులు. వీరు తిరుమలలో ప్రతి రోజు శ్రీనివాసుల కోసం అకాశగంగ పవిత్ర జలాలను తీసుకువచ్చే కైంకర్యం చేస్తుండేవారు. మహా నిష్ఠతో శ్రీనివాసులకు సేవ చేస్తుండేవారు. రామానుజులకు అందమైన అర్థాలతో  శ్రీ రామాయణాన్ని బోధించమని వీరి ఆచార్యులైన ఆళవందార్ల నిర్ధేశము. మన సాంప్రదాయంలో శ్రీ రామాయణాన్ని శరణాగతి శాస్త్రమని పిలుస్తారు. వీరు రామానుజులకు మేనమామ అయినందున ‘ఇళైయార్వార్’ అని రామానుజులకు పేరు పెట్టింది కూడా వీరే. అంతే కాకుండా రామానుజుల పిన్నమ్మ కొడుకు ‘గోవింద పెరుమాళ్’ ను కూడా సాంప్రదాయంలోకి తిరిగి తీసుకువచ్చింది తిరుమలై నంబి వారే. వీరికి సాంప్రదాయ విషయాలన్నా, ఆళ్వార్ల పాశురాలన్నా మహా ప్రీతి.

పరాశర: నాన్నమ్మా, తిరుమాలై ఆండాన్ గురించి చెబుతారా? వారు రామానుజులకు ఎలా సహాయం చేసారు?

బామ్మగారు: తిరువాయ్మోళి అర్థాలను నేర్పించే బాధ్యత తిరుమాలై ఆండాన్ కు ఇవ్వబడింది. రామానుజులు శ్రీరంగానికి వచ్చిన తరువాత, తిరుక్కోష్టివూర్ నంబి వారిని నమ్మాళ్వార్ల తిరువయ్మోలిని విని అర్థం చేసుకోమని తిరుమాలై ఆండాన్ వద్దకు చేరుస్తారు. మొదట్లో, వీరిరువుల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ,  ఆచార్యులైన తిరుమాలై ఆండాన్ల  ఆశీర్వాదాలతో ఆళ్వార్ల పాశురాలలో దాగి ఉన్నఅర్థాలను నేర్చుకుంటారు. తిరుమాలై ఆండానుకి తమ ఆచార్యులు ఆళవందార్లంటే మహా భక్తి ప్రపత్తులు ఉండేది. వీరు తమ ఆచార్యుడు నిర్దేశించిన మార్గాన్ని, బోధనలను ఎప్పుడూ తప్పే వారు కాదు. మన సాంప్రదాయ కైంకర్యాలను నిష్ఠగా నిర్వహిస్తారని అదే వారు రామానుజులకు కూడా నేర్పిస్తారు.

వేదవల్లి: మరి తిరుక్కోష్టియూర్ నంబి, తిరుక్కచ్చి నంబి గురించి చెప్పండి నాన్నమ్మా?

బామ్మగారు: వాళ్ళకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన కథలు ఈ సారి కలుసినపుడు చెప్తాను.

పిల్లలందరూ ఒకేసారి: ఇప్పుడే చెప్పండి నాన్నమ్మా.

బామ్మగారు: ఇక ఆలస్యమవుతుంది. ఇవాల్టికి ఇది చాలు. ఇంటికి వెళ్లి రేపు మళ్ళీ రండి.  మీతో పాటు మీ స్నేహితులను కూడా తీసుకురావడం మర్చిపోకండి.

పిల్లలు ఆచార్యుల గురించి ఆలోచిస్తూ వారి ఇళ్లకి వెళ్లి, మర్నాడు నాన్నమ్మ చెప్పబోయే కథల గురించి ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2016/07/beginners-guide-alavandhars-sishyas-1/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – పెరియ నంబి

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< ఆళవందార్

వ్యాస పరాశరులు బామ్మగారి ఇంటికి వస్తారు. చేతిలో ఒక బహుమానాన్ని పట్టుకొని అత్తుళాయ్ లోపలికి వస్తుంది.

బామ్మగారు: ఏమిటిది అత్తుళాయ్?

వ్యాస: నాన్నమ్మా, మా బడి పోటీలల్లో అత్తుళాయ్ ఆండాళ్ లాగా నటించింది, తిరుప్పావై పాశురాలని పాడి మొదటి బహుమతిని గెలుచుకుంది.

బామ్మగారు: శభాష్ అత్తుళాయ్! ఈ రోజు మీకు పెరియనంబి వారి గురించి చెప్పి, ఆ తర్వాత పాశురాలను నేను వింటాను.

పిల్లలు : ఇలైయాళ్వార్ల గురించి కూడా నాన్నమ్మా.

బామ్మగారు: అవును, అవును. పెరియనంబి వారు ఆళవందార్ల ప్రధాన శిష్యులలో ఒకరు. శ్రీరంగంలో మార్గశిర మాసం, జ్యేష్ట నక్షత్రంలో జన్మించారు.  ఇలైయాళ్వార్ను కాంచీపురం నుండి శ్రీరంగానికి రప్పించింది కూడా వీరే. ఇలైయాళ్వార్ను కలుసుకోవడానికి పెరియనంబి వారు కంచికి వెళుతుండగా, ఇలైయాళ్వార్ పెరియనంబి వారిని కలుసుకునేందుకు శ్రీరంగం నుండి బయలుదేరతారు.

పరాశర: నాన్నమ్మా, ఇలైయాళ్వార్లు కాంచిపురంలో యాదవప్రకాశుల వద్ద విధ్య నేర్చుకుంటుండగా శ్రీరంగానికి ఎందుకు బయలుదేరారు?

బామ్మగారు: మంచి ప్రశ్న! మీకు మొన్న ఒక మాట చెప్పాను గుర్తుందా, ఆళవందార్లు ఇలైయాళ్వార్లని తిరుక్కచ్చినంబికి అప్పగించి అవసరాన్ని బట్టి మార్గనిర్దేశం చేయమని చెబుతారు. యాదవప్రకాశులతో అభిప్రాయభేదాలు మొదలై ఇలైయాళ్వార్లు సతమతమవుతుండగా, పరిష్కారం కోసం తిరుక్కచ్చినంబి వారిని అడుగుతారు. మార్గదర్శం చేయమని తిరుక్కచ్చినంబి వెళ్లి ఎవరిని అడుగుతారు?

అత్తుళాయ్: దేవ పెరుమాళ్!

బామ్మగారు: అద్భుతం! దేవ పెరుమాళ్ళు సదా ఇలైయాళ్వార్ల రక్షణ కోసం ముందుండేవారు. ఇలైయాళ్వార్లను పెరియనంబి వద్ద పంచ సంస్కారము కానిచ్చి వారి శిష్యులు కామని దేవ పెరుమాళ్ళు నిర్దేశిస్తారు. అతను ఒక ప్రకాశవంతమైన, ఉదయించే సూర్యుడు చీకటి రాత్రిని తొలగించినట్టు ఇలైయాళ్వార్ల మనస్సులో సందేహాలను దేవ పెరుమాళ్ళు తొలగిస్తారు. అట్లా, కాంచీపురం నుండి ఇలైయాళ్వార్లు బయలుదేరారు. మరోవైపు పెరియనంబి వారు ఇలైయాళ్వార్లు కలుకోడానికి కాంచీపురానికి బయలుదేరారు. వీరిద్దరూ మధురాంతగం అనే ప్రదేశంలో కలుసుకుంటారు.  పెరియ నంబులు ఇలైయాళ్వార్లకు అక్కడే పంచ సంస్కారము చేసి మన సాంప్రదాయంలోకి ప్రవేశింపజేస్తారు.

వ్యాస: అవును, మధురాంతగంలో యేరికాత్త రామాలయం ఉంది. పోయిన సెలవుల్లో మేము ఆ గుడికి వెళ్ళాము. కానీ, కాంచీపురం లేదా శ్రీరంగానికి వేళ్ళెవరుకు ఇలైయాళ్వార్లు ఎందుకు ఆగలేదు? మధురాంతగంలోనే ఉన్న ఫలంగా ఎందుకు దక్షను తీసుకున్నారు?

పెరియ నంబి – శ్రీరంగం

బామ్మగారు: పెరియనంబులు ఒక గొప్ప మహిమగల ఆచార్యులు. వీరికి ఇలైయాళ్వార్ల పట్ల అపారమైన ప్రేమ గౌరవం ఉండేది. ఇలాంటి శుభ కార్యాలను వాయిదా వేయకూడదని వారికి తెలుసు. పిల్లలు! దీని నుంచి మనకేమి తెలుస్తుందంటే, సాంప్రదాయానికి  సంబంధించిన పనులను చేయడంలో వాయిదా కన్నీ ఆలస్యం కానీ చేయకూడదు. ఎంత తొందరగా చేస్తే అంత మంచిది! పెరియనంబి వారు సాంప్రదాయ విషయాలను లోతుగా ఎరిగినవారు. తన శిష్యుడైన రామానుజులను ఎంతో ఇష్టపడేవారు. ఎంత అంటే సాంప్రదాయం కోసం – రామానుజుల కోసం తమ జీవితాన్నే ధార పోసారు.

వ్యాస: తమ జీవితాన్నే అర్పించారా! ఎందుకు అలా చేసారు నాన్నమ్మా?

బామ్మగారు: ఆ ప్రాంతాన్ని పలిపాలించే రాజు ( శైవుడు) రామానుజులను రాజసభకు హాజరు కావలసిందిగా ఆజ్ఞాపిస్తారు. రామానుజుల వేషంలో వారి ప్రియ శిష్యుడైన కూరత్తాల్వాన్లు, వయోవృద్ధిలైన పెరియనంబులు, వారి పుత్రిక అత్తుళాయ్ కలిసి రాజ సభకు వెళతారు.

అత్తుళాయ్: అది నా పేరు!

బామ్మగారు: అవును! రాజాజ్ఞను పాటించనందుకు, ఆగ్రహంతో రాజు వారిద్దరి కళ్ళు తీసేయమని సేవకులకు ఆదేశిస్తారు. వయోవృద్ధిలైన పెరియనంబులు ఆ బాధను తట్టుకోలేక తిరిగి శ్రీరంగానికి వెళ్తుండగా కూరత్తాల్వాన్ల వడిలో తమ జీవితాన్ని త్యాగం చేసి పరమపదం చేరుకుంటారు. ఈ మహాత్ములు సంకోచించకుండా ముత్యాలమాలలో మహామణి వంటి రామానుజులను కాపాడటానికి త్యాగం చేశారు. మాలలోని ముత్యాలను చిన్నాభిన్నం చేస్తే ఏమవుతుంది?

పిల్లలు ఒకే సారిగా: మాల తెగిపోతుంది!

బామ్మగారు: సరిగ్గా!  అదేవిధంగా, మన సాంప్రదాయానికి మణి వంటి రామానుజులను ముత్యాల వంటి మన పూర్వాచార్యులందరు సంరక్షిస్తుండేవారు. కాబట్టి మనందరం మన ఆచార్యాలకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

పరాశర: నాన్నమ్మా, కూరత్తాల్వాన్లకి ఏమి అయింది?

బామ్మగారు: కూరత్తాల్వాన్లు నేత్రహీనులై తిరిగి శ్రీరంగానికి వచ్చారు. వీరు రామానుజుల ప్రియ శిష్యుడు. సదా  రామానుజులతో ఉండి ఎన్నో కైంకర్యాలు చేశారు. మరెప్పుడైనా రామానుజులు, వారి శిష్యుడైన కూరత్తాల్వాన్ల గురించి మీకు చెప్తాను. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్లండి. మీ అమ్మానాన్నలు మీ కోసం ఎదురుచూస్తుంటారు. అత్తుళాయ్, ఈ సారి వచ్చినపుడు తిరుప్పావై పాశురాలను నాకు వినిపించాలి.

పెరియనంబులు కూరత్తాల్వాన్ల గురించి ఆలోచిస్తూ పిల్లలు ఇంటికి వెళ్ళారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2016/07/beginners-guide-periya-nambi/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – ఆళవందార్

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< ఉయ్యక్కొణ్డార్, మణక్కాల్ నంబి

వ్యాస పరాశరులు అత్తుళాయ్ తో కలిసి బామ్మగారి ఇంటికి వస్తారు. బామ్మగారు వాళ్ళకి ప్రసాదాన్నిచ్చి కూర్చోమంటారు.

బామ్మగారు:  పిల్లలూ! ఇక్కడ మీ కాళ్ళు చేతులు కడుక్కొని ఈ ప్రసాదం తీసుకోండి. ఈ వేళ ఉత్తరాషాడం, ఆళవందార్ల తిరునక్షత్రం.

పరాశర: నాన్నమ్మా, పోయిన సారి మీరు యమునైత్తుఱైవర్ గురించి మాకు చెప్తానని అన్నారు గుర్తుందా?

బామ్మగారు: అవును! గుర్తుంది. ఆచార్యుల గురించి తెలుసుకోవాలన్న మీ ఆసక్తిని చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వేళ వారి తిరునక్షతరం. వారి మహిమల గురించి చెప్పుకోడానికి మనకు సరైన రోజు.

వ్యాస: నాన్నమ్మా, కానీ మీరు ఆళవందార్ల తిరునక్షత్రం అని అన్నారు కదా?

ఆళవందార్ – కాట్టు మన్నార్ కోయిల్

బామ్మగారు: అవును. కట్టూమన్నర్ కైయిల్లో జన్మించిన యమునైత్తుఱైవర్ తరువాతి కాలంలో ఆళవందార్లుగా ప్రసిద్ది చెందారు. వీరు ఈశ్వరముని పుత్రులు, నాథమునుల మనుమలు. వీరు మహాభాష్య భట్టర్ల వద్ద విద్యను అభ్యసించారు. వీరు ఆళవందార్లుగా పిలువబడడానికి ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. ఆ రోజులల్లో పండితులు తమ ప్రధాన పండితునికి పన్నులు చెల్లించేవారు. ఆక్కియాల్వాన్ అనే రాజ పురోహితుడు తన ప్రతినిధులను పండితుల వద్దకు పన్నులు చెల్లించమని పంపేవారు. మహాభాష్య భట్టర్ కొంచం సంకోచిస్తారు. యమునైత్తుఱైవర్ తను చూసుకుంటాడని వారికి ధైర్యం  చెబుతారు. అతను “చవకబారి ప్రతిష్ఠను ఆశించే కవులను నాశనం చేస్తాను” అని ఒక శ్లోకాన్ని పంపుతాడు. ఇది చూసిన ఆక్కియాల్వాన్ కు కోపం వచ్చి, యమునైత్తుఱైవర్ని రాజసభకి తీసుకురమ్మని తన సైనికులను పంపుతాడు. యమునైత్తుఱైవర్ తనకు తగిన గౌరవం ఇచ్చినప్పుడు మాత్రమే వస్తాను అని అంటారు. రాజు వారి కోసం పల్లకిని పంపితే యమునైత్తుఱైవర్ సభకి హాజరౌతారు. చర్చ మొదలవుతుండగా రాణి యమునైత్తుఱైవర్ గెలుస్తాడని రాజుతో అంటుంది. ఒక వేళ ఓడిపోతే, ఆమె రాజుకి దాసురాలై సేవ చేస్తానని పందెం కడుతుంది. రాజు ఆక్కియాల్వాన్ గెలుస్తాడన్న నమ్మకంతో ఒకవేళ యమునైత్తుఱైవర్ గెలుస్తే అతనికి సగం రాజ్యాన్ని ఇస్తానని ప్రకటిస్తారు. చివరకు, గొప్ప శౌర్యం జ్ఞానంతో, యమునైత్తుఱైవర్ ఆక్కియాల్వాన్ పై విజయం సాధిస్తారు. ఆక్కియాల్వాన్ యమునైత్తుఱైవర్ శిష్యులు అవుతారు. తనని రక్షించాడని రాణి “ఆళవందార్” అనే పేరును ఇస్తుంది – ఒక వేళ అతను ఓడిపోతే, ఆమె ఒక దాసిగా మారి ఉండేది. తరువాత ఆమె కూడా ఆళవందార్ల శిష్యురాలౌతుంది. రాజు వాగ్దానం ప్రకారం అతనికి సగం రాజ్యాన్ని ఇస్తాడు.

వ్యాస: నాన్నమ్మా, యమునైత్తుఱైవర్ సగం రాజ్యం పొందాడంటే, అతను ఆ రాజ్యాన్ని పరిపాలించి వుండాలి. మన సాంప్రదాయంలోకి ఎలా వచ్చారు?

అత్తుళాయ్: ఉయ్యక్కొండార్ శిష్యులైన మణక్కాళ్ నంబి ద్వారా వీరు మన సాంప్రదాయంలోకి వచ్చారు. ఉయ్యక్కొండార్ నిర్దేశం ప్రకారం మణక్కాళ్ నంబి ఆళవందార్లను తీసుకువస్తారు.

బామ్మగారు: నిజం అత్తుళాయ్! దీని గురించి నీకు ఎలా తెలుసు?

అత్తుళాయ్: మా అమ్మ కూడా మన ఆచార్యులు, పెరుమాళ్ళ విషయాల గురించి అప్పుడప్పుడు చుబుతుంటుంది.

బామ్మగారు: ఆళవందార్లు ఒక గొప్ప ఆచార్యులు, దేవపెరుమాళ్ళ అనుగ్రహంతో శ్రీ రామానుజులను మన సాంప్రదాయంలోకి తీసుకువచ్చారు.

పరాశర: కానీ నాన్నమ్మా, దేవపెరుమాళ్ళు ఆళవందార్లకి ఎలా సహాయం చేస్తారు?

బామ్మగారు: ఆళవందార్లు కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ళ సన్నిధి వద్ద ఇళైయాళ్వార్ని (రామానుజులు) చూస్తారు. ఇళైయాళ్వార్లు తన గురువులైన యాదవ ప్రకాశుల వద్ద విద్య నేర్చుకొనే రోజులవి. సాంప్రదాయం తర్వాతి నాయకుడిగా ఇళైయాళ్వార్ని తయారు చేయాలని ఆళవందార్లు పెరుమాళ్ళను ప్రార్థిస్తారు. దేవపెరుమాళ్ళు ఒక తల్లిలా ఇళైయాళ్వార్ని పెంచి రామోయే కాలంలో గొప్పలో మహాగొప్ప సాంప్రదాయ కైంకర్యాలని వీరికి అనుగ్రహిస్తారు. సరైన విధంగా ఇళైయాళ్వార్లకు మార్గనిర్దేశం చేయమని తిరుక్కచ్చినంబికి ఆళవందార్లు అప్పగిస్తారు. తిరుక్కచ్చినంబి మీకు గుర్తున్నారా?

వ్యాస: అవును నాన్నమ్మా, వీరు దేవపెరుమాళ్, తాయార్లకు తిరువాలవట్ట (వింజామర) కైంకర్యం చేసేవారు. దేవపెరుమాళ్ళతో పరస్పరం మాట్లాడేవారు కూడా. మనం కూడా తిరుక్కచ్చినంబిలాగా పెరుమాళ్ళతో మాట్లాడినట్లయితే ఎంత బాగుంటుంది? అయితే ఆళవందార్లు ఇళైయాళ్వార్లని కలిసారా? ఆళవందార్లు ఇళైయాళ్వార్ని తమ శిష్యులుగా చేసుకున్నారా?

బామ్మగారు: దురదృష్టవశాత్తు కలుసుకోలేదు! ఆళవందార్ల శిష్యుడిగా కావటానికి ఇళైయాళ్వార్లు శ్రీరంగానికి బయలుదేరారు. వీరు శ్రీరంగం చేరుకునే  ముందే ఆళవందార్లు పరమపదానికి చేరుకుంటారు. వీళ్ళు ఒకరినొకరు కలుసుకోలేకపోయారు కానీ ఆళవందార్ల 3 కోరికలను నెరవేరుస్తానని ఇళైయాళ్వార్లు ప్రమాణం ఇస్తారు.

ఈ సారి మనం కలుసుకున్నప్పుడు, నేను మీకు ఆళవందార్ల శిష్యులలో ఒకరైన పెరియ నంబి గురించి చెప్తాను. వీరే ఇళైయాళ్వార్లకు గురువై మార్గదర్శకులగా నిలిచి ముందుకు నడిపించారు. ఆళవందార్లకు అనేక శిష్యులు ఉండేవారు. వారందరూ ఇళైయాళ్వార్ని సాంప్రదాయంలోకి తీసుకురావడానికి కలిసి కృషి చేశారు. పెరియ నంబి, పెరియ తిరుమలై నంబి, తిరుక్కోష్టియూర్ నంబి, తిరుమలై ఆండాన్, మాఱనేరి నంబి, తిరుక్కచ్చి నంబి, తిరువరంగ పెరుమాళ్ అరైయర్ ఇంకా మరెందరో ఆళవందార్లకు శిష్యులుగా ఉండేవారు.

పిల్లలు: బావుంది నాన్నమ్మా. ఈ సారి మాకు పెరియ నంబి,  ఇళైయాళ్వార్ల గురించి చెప్పండి.

బామ్మగారు: తప్పకుండా చెప్తాను. కానీ ఇప్పుడు ఇక చీకటి పడుతోంది. మీరు ఇంటికి వెళ్లండి.

పిల్లలు ఆళవందార్ల గురించి ఆలోచిస్తూ వారి ఇళ్లకు బయలుదేరుతారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2016/07/beginners-guide-alavandhar/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – ఉయ్యక్కొణ్డార్ మరియు మణక్కాల్ నమ్బి

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< నాథమునులు

వ్యాస పరాశరులు ఇంకొక స్నేహితురాలు వేదవల్లిని తీసుకొని బామ్మగారింటికి వస్తారు. బామ్మగారు వాళ్ళకి తన చేతుల్లో ఉన్న ప్రసాదాన్ని ఇచ్చి కూర్చోమని అంటుంది.

బామ్మగారు: ఇదిగో ఈ ప్రసాదం తీసుకుని మీ కొత్త స్నేహితురాలు ఎవరో చెప్పండి.

వ్యాస: ఈమె పేరు వేదవల్లి నాన్నమ్మా! సెలవుల కోసం కాంచీపురం నుండి వచ్చింది. తను కూడా మన ఆచార్యుల చరిత్రలను వినాలని మాతో వచ్చింది.

పరాశర: ఈవేళ ఏదైనా పండుగా నాన్నమ్మా?

బామ్మగారు: ఈవేళ ఉయ్యక్కొండార్ల తిరునక్షత్రము. వీరిని పద్మాక్షర్, పుండరీకాక్షర్ అని కూడా పిలుస్తారు.

uyyakkondar

వ్యాస: నాన్నమ్మా, ఈ ఆచార్యుని గురించి చెప్తారా?

బామ్మగారు: వీరు చైత్ర మాసం కృత్తికా నక్షత్రంలో తిరువెళ్ళఱై దివ్య దేశంలో జన్మించారు. అక్కడ జన్మించినందున తిరువెళ్ళఱై పెరుమాళ్ళ పేరునే పెట్టారు. వీరు నాథమునుల ప్రధాన శిష్యులలో ఒకరు. కురుగై కావలప్పన్ వీరి సహశిష్యులు. నాథమునులకు అష్టాంగ యోగ సిద్ధి నమ్మాళ్వార్ల అనుగ్రహంతో లభించింది.

పరాశర: అష్టాంగ యోగం అంటే ఏమిటి నాన్నమ్మా?

బామ్మగారు: యోగాలలో ఈ యోగ పద్ధతి ఒక రకం. దీని ద్వారా శారీరిక ధ్యాస లేకుండా నిరంతరాయముగా భగవానుడిని అనుభవించవచ్చు. నాథమునులు ఈ అష్టాంగ యోగాన్ని కురుగై కావలప్పన్ కు నేర్పించి, ఉయ్యక్కొండార్ను నేర్చుకుంటారేమోనని అడిగారు. ఉయ్యక్కొండార్ “పిణం కిడక్క మణం పుణరళామొ?” అని అంటారు.

పరాశర: నాన్నమ్మా, ఎవరైనా మరణిస్తే మనం సంతోషించలేము అని చెబుతున్నారా? ఎవరు మరణించారు?

బామ్మగారు: అద్భుతం పరాశర! ఈ లోకంలో అనేక మంది బాధపడుతున్నప్పుడు తానొక్కడే భగవానుడిని అనుభవించాలని ఎలా అనుకుంటామని వారన్నారు. ఇది విన్న, నాథమునులు సంతోషపడి ఉయ్యక్కొండార్ల ఔదార్యాన్ని ప్రశంసిస్తారు. ఈశ్వరముని కుమారుడికి (నాథమునుల మనవడు) అష్టాంగ యోగం, దివ్య ప్రబంధం, వాటి అర్థాలని బోధించమని ఉయ్యక్కొండార్, కురుగై కావలప్పన్ ను నిర్దేశిస్తారు.

వ్యాస: నాన్నమ్మా ఉయ్యక్కొండార్ కు శిష్యులు ఎవరైనా ఉన్నారా?

బామ్మగారు: మణక్కాళ్ నంబి ఉయ్యక్కొండార్ల ప్రధాన శిష్యుడు. పరమపదానికి వెళ్ళే సమయములో, ఉయ్యక్కొండార్లు మణక్కాళ్ నంబిని సంప్రదాయ బాధ్యతలు నిర్వహించమని నిర్దేశిస్తారు. యామునైత్తుఱైవర్ (ఈశ్వరముని పుత్రుడు) ని వారి ఉత్తరాధికారిగా సిద్ధం చేయమని నిర్దేశిస్తారు.

పరాశర: నాన్నమ్మా మణక్కాళ్ నంబి గురించి మాకు చెప్పగలరా?

బామ్మగారు: వారి అసలు పేరు రామమిశ్రార్. మాఘ మాసం మఖా నక్షత్రంలో మణక్కాళ్ అనే ఊరులో జన్మించారు. మధురకవి ఆళ్వార్లు ఎలా నమ్మాళ్వార్లకి అంకితులై ఉండేవారో, మణక్కాళ్ నంబి ఉయ్యక్కొండార్లకి అంకితులై ఉండేవారు. ఉయ్యక్కొండార్ల ధర్మపత్ని మరణించిన తరువాత, వీరి వంట కైంకర్యాన్ని నిర్వహిస్తూ తమ ఆచార్యుని ప్రతి అవరాలను శ్రద్ధగా చూసుకునేవారు. ఉయ్యక్కొండార్ల కుమార్తెలు నదిలో స్నానం చేసి వస్తుండగా ఒకసారి వాళ్ళు బురదను దాటాల్సివస్తుంది. రామమిశ్రులు ఆ బురదలో పడుకొని వాళ్ళకు బురద అంటుకోకుండా దాటిస్తారు. ఇది విన్న ఉయ్యక్కొండార్లు నంబి శ్రద్ధ అంకితభావానికి ఎంతో గర్విస్తారు.

పిల్లలు: నాన్నమ్మా, మనము ఈసారి కలిసినప్పుడు మాకు యమునైత్తురైవర్క చరిత్రను చెప్పాలి?

నాన్నమ్మ సంతోషంగా సరే అన్న తరువాత పిల్లలు వాళ్ళ వాళ్ళ ఇండ్లకి వెళ వెళతారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2015/10/beginners-guide-uyakkondar-and-manakkal-nambi/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – నాథమునులు

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< ఆచార్యుల పరిచయము

nathamunigalవ్యాస పరాశరులు బడి నుండి ఇంటికి వచ్చారు. వాళ్ళతో పాటు వాళ్ళ స్నేహితురాలు అత్తుళాయ్ ని తీసుకువచ్చారు.

బామ్మగారు: మీరు ఎవరిని వెంట తీసుకువచ్చారు? ఎవరీ అమ్మాయి?

వ్యాస: నాన్నమ్మా! ఈమె పేరు అత్తుళాయ్, మా స్నేహితురాలు. మీరు మాతో చెప్పిన కొన్ని విషయాలను ఈమెకు చెప్పాము. మీ నుండి ఇంకా వినాలని ఆశతో మాతో వచ్చింది.

బామ్మగారు: బావుందమ్మా అత్తుళాయ్. మీరిద్దరూ నేను చెప్పేది వినడమే కాకుండా,  మీ స్నేహితులకు కూడా వినిపిస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది.

పరాశర: నాన్నమ్మా, మన ఆచార్యుల గురించి చెప్తారా?

బామ్మగారు: సరే. ఈ రోజు మీకు నమ్మాళ్వార్ల దివ్య అనుగ్రహంతో మన సాంప్రదాయ మహిమను తిరిగి వెలుగులోకి తీసుకు వచ్చిన ఆచార్యుడి గురించి చెప్తాను.

అత్తుళాయ్: ఎవరు నాన్నమ్మా?

అత్తుళాయ్, వ్యాస పారాశరులు తినడం కోసం బామ్మగారు కొన్ని పండ్లు తెస్తుంది.

బామ్మగారు: వారు మన నాథమునులు. వీరనారాయణపురంలో (కాట్టు మన్నార్ కోయిల్) ఈశ్వర భాట్టాల్వార్లకు వీరు జన్మించారు. వీరిని శ్రీరంగనాథముని అని, నాథబ్రహ్మర్ అని కూడా పిలుస్తారు. వీరు అష్టాంగ యోగంలో, సంగీతంలో మహానిపుణులు. అంతేకాదు అరైయర్ సేవను స్థాపించిన వీరే. ఇప్పటికీ శ్రీరంగం, ఆళ్వార్తిరునాగరి, శ్రీవిల్లిపుత్తూర్  మొదలైన దివ్య దేశాలలో ఈ అరైయర్ సేవ జరుగుతుంది.

పరాశర: నాన్నమ్మా! పెరుమాళ్ళ ముందు అరైయర్ సేవ జరుగుతుండగా మేము ఎన్నో సార్లు చూసాము. అరైయర్ స్వామి తన చేతుల్లో తాళం పట్టుకొని పాశురాలు పాడుతుంటే చాలా అద్భుతంగా ఉంటుంది.

బామ్మగారు: అవును. ఒక రోజు, తిరునారాయణపురం ప్రాంతం నుండి ఒక శ్రీవైష్ణవుల గోష్ఠి కాట్టుమన్నార్ కోయిల్ కి వచ్చింది.  మన్నార్ (కాట్టుమన్నార్ కోయిల్ లోని పెరుమాళ్ళు) ముందు తిరువాయ్మోళిలోని ” ఆరావముదే …” పాశురాలను సేవించారు. నాథమునులు ఆ పాశురాల అర్థంతో ముగ్దుడై వాటి గురించి ఆ శ్రీవైష్ణవులను అడిగారు. కానీ వాళ్ళకు ఆ 11 పాశురాలు తప్ప వాటి గురించి ఇంకేమీ తెలియదు. కానీ, తిరుక్కురుగూర్కి వెళితే, అక్కడ ఈ వివరాలను తెలుసుకోవచ్చు అని నాథమునులకు చెప్పారు. నాథమునులు మన్నార్ దగ్గర సెలవు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి ఆళ్వార్తిరునగరికి చేరుకుంటారు.

అత్తుళాయ్, వ్యాస పరాశరులు ఆత్రుతగా నాథమునుల గురించి వింటున్నారు.

బామ్మగారు: నాథమునులు మాధురకవి ఆళ్వార్ల శిష్యుడైన పరాంకుశదాసుని కలుసుకుంటారు. వారు నాథమునులకు కణ్ణినుణ్ చిరుత్తాంబును బోధించి తిరుప్పులియాల్వార్ (చింత చెట్టు, నమ్మాళ్వార్లు ఉన్న చోట) ఎదుట కూర్చొని 12000 సార్లు నిరంతరంగా ఈ కణ్ణినుణ్ చిరుత్తాంబును పటించమని చెబుతారు. నాథమునులు అష్టాంగ యోగంలో సిద్ధులు కాబట్టి, నమ్మాళ్వార్లని ధ్యానించి ఏకధాటిగా కణ్ణినుణ్ చిరుత్తాంబును 12000 సార్లు పఠించి పూర్తి చేస్తారు. నమ్మాళ్వార్లు ప్రసన్నులై నాథమునుల ఎదుట ప్రత్యక్షమై అష్టాంగ యోగం, 4000 దివ్య ప్రబంధం, అరుళిచెయ్యల్ (దివ్య ప్రబంధం) అర్ధాల జ్ఞానాన్ని ప్రసాదించి ఆశీర్వదిస్తారు.

వ్యాస: అయితే, ‘ఆరావముదే’ పదిగం 4000 దివ్య ప్రబంధంలోనిదేనా నాన్నమ్మా?

బామ్మగారు: అవును. ‘ఆరావముదే’ పదిగం తిరుక్కుడంతై  ఆరావముదన్ పెరుమాళ్ళను స్తుతిస్తూ పాడినది. ఆ తరువాత, నాథమునులు కాట్టుమన్నార్ కోయిల్ కి తిరిగి వచ్చి మన్నార్ పెరుమాళ్ళకు 4000 దివ్య ప్రబంధం సమర్పిస్తారు. మన్నార్ పెరుమాళ్ళు ప్రసన్నులై దివ్య ప్రబందాన్ని వర్గీకరణ చేసి నలుమూలలా ప్రచారం చేయమని నాథమునులకు నిర్దేశిస్తారు. నాథమునులు అరుళిచ్చెయల్ కి సంగీతాన్ని జతపరచి వారి మేనల్లుడైన కీలై అగత్తాళాన్ కు భోదించి వారి ద్వారా ప్రచారం చేస్తారు. అంతేకాక, తమ యోగసిద్ది ద్వారా దివ్య దృష్ఠితో మన సాంప్రదాయంలో మరొక గొప్ప ఆచార్యడు రానున్నాడని చెబుతారు. మరెప్పుడైనా వారి గురించి మీకు చెప్తాను.

పిల్లలు: సరే నాన్నమ్మ.

అత్తుళాయ్ నాన్నమ్మ ఆశీర్వాదం తీసుకోని ఇంటికి బయలుదేరింది, అయితే వ్యాస పరాశరులు చదువుకోడానికి వెళతారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2015/06/nathamunigal/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – ఆచార్యుల పరిచయము

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< దివ్య ప్రబంధము – ఆళ్వార్లు అనుగ్రహించిన విలువైన కానుక

Acharyas

ఆచార్య రత్నహారం

సెలవుల్లో తిరువల్లిక్కేణి వాళ్ళ అమ్మమ్మింటికి వెళ్లి వచ్చారు వ్యాస పరాశరులు. ఇప్పుడు ఆండాళమ్మ దగ్గరకు వచ్చారు.

బామ్మగారు: పరాశర! వ్యాస! బావున్నారా? తిరువల్లిక్కేణి ప్రయాణం బాగా సాగిందా?

పరాశర:  అవును నాన్నమ్మా!  అద్భుతంగా ఉండింది. మేము రోజూ పార్థసారథి పెరుమాళ్ళ గుడికి వెళ్ళాము. అంతేకాదు, దగ్గర్లోని కాంచీపురం మొదలైన దివ్యదేశాలకు వెళ్ళాము. శ్రీపెరుంబుదూర్ కూడా వెళ్లి ఎంబెరుమానార్ల దర్శనం కూడా చేసుకున్నాము.

బామ్మగారు: బాగుంది. శ్రీపెరుంబుదూర్ రామానుజుల జన్మ స్థలం. వారు మన ఆచార్యులలో అతి ముఖ్యమైన వారు. నేను త్వరలో మీకు వారి గురించి మరిన్ని వివరాలు చెప్తాను. మొన్నసారి నేను ఆచార్యుల గురించి చెప్తాను అని చెప్పాను కదా! ఇప్పుదు పరిచయం చేస్తాను వినండి. “ఆచార్య” అనే పదానికి అర్థమేమిటో మీకు తెలుసా?

వ్యాస: నాన్నమ్మ! ఆచార్య, గురువు అంటే ఒకటేనా?

బామ్మగారు: అవును. ‘ఆచార్య’, ‘గురువు’ సమానమైన పదాలే. ఆచార్య అంటే జ్ఞానాన్ని అధ్యయనం చేసి, ఆచరించి, అందరూ అనుసరించేలా చేసేవాడు. గురువు అనగా మన అజ్ఞానాన్ని తొలగించేవాడు.

పరాశర:  “నిజమైన జ్ఞానం” ఏమిటి నాన్నమ్మా?

బామ్మగారు: చాలా తెలివైన ప్రశ్న వేసావు పరాశర. నిజమైన జ్ఞానం అంటే మనమెవరో, మన బాధ్యతలేమిటో తెలుసుకోవటం. ఉదాహరణకు, నేను మీ నాన్నమ్మను. మీకు మంచి మాటలు చెప్పి మంచి బాటలో నడిపించడం నా బాధ్యత. ఈ జ్ఞానం నాకు ఉంటే నాకు నిజమైన జ్ఞానం ఉన్నదని అర్థం. అట్లానే, మనందరం భగవానుడి సేవకులం, అతను మనందరికీ యజమాని. ఒక యజమానిగా మన సేవకు అతను అర్హుడు. అలాగే ఒక దాసునిగా ఆయనను సేవించడం మన బాధ్యత. ఇది ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవలసిన సాధారణమైన “నిజమైన జ్ఞానం”. ఇది తెలిసుకొని, ఆచరించి అందరికీ నేర్పించే వారిని ‘ఆచార్యులు’ అని పిలుస్తాము. ఇదే “నిజమైన జ్ఞానం” వేదం, వేదాంతం , దివ్య ప్రబంధంలో ఉంది.

వ్యాస:  ఓ! అయితే, మొదటి ఆచార్యుడు ఎవరు? ఈ “నిజమైన జ్ఞానం” అందరికీ బోధించడానికి మొదట ఎవరికో ఒకరికి ఈ జ్ఞానం తెలిసి ఉండాలి కదా?.

బామ్మగారు: తెలివైన ప్రశ్నవ్యాస. మన పెరియ పెరుమాళ్ళే మొదటి ఆచార్యుడు. ఇప్పటి వరకు ఆళ్వార్ల గురించి చూశాము. పెరుమాళ్ళు వారికి యదార్థ జ్ఞానాన్ని ప్రసాదించారు. వాళ్ళ చరిత్రలలో మనము చూశాము, ఆళ్వార్లు పెరుమాళ్ళ పట్ల మహాప్రీతితో జీవించారు. వాళ్ళు ఆ నిజమైన జ్ఞానాన్ని దివ్య ప్రబంధం ద్వారా మనకు ప్రసరింపజేశారు.

పరాశర: నాన్నమ్మా!  ఆళ్వార్ల కాలం తర్వాత, ఏమి జరిగింది?

బామ్మగారు: ఆళ్వార్లు కొంతకాలం ఈ భూలోకంలో ఉన్న తరువాత పరమపదానికి వెళ్ళిపోయారు. జ్ఞానం నెమ్మదిగా క్షీణించి, దివ్య ప్రబంధాలు దాదాపుగా నష్టమైపోయినప్పుడు నలుమూలలా చీకటి అలుముకుంది.  కానీ నమ్మాళ్వార్ల కృపతో, మనకు దివ్యప్రబంధాలు తిరిగి లభించాయి. ఆ తరువాత కాలంలో అనేక ఆచార్యులు వాటిని ప్రచారం చేసారు. మనము ఆ ఆచార్యుల గురించి చూద్దాము.

వ్యాస పరాశరులు:  సరే నాన్నమ్మ!

బామ్మగారు: మీ అమ్మానాన్నలు పిలుస్తున్నారు. ఇంకోసారి కలిసినప్పుడు మన ఆచార్యుల గురించి మరిన్ని విషయాలు చెప్తాను.

అడియేన్ రఘువంశీ రామానుజ దాసన్

మూలము :  http://pillai.koyil.org/index.php/2015/06/introduction-to-acharyas/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – దివ్య ప్రబంధము – ఆళ్వార్లు అనుగ్రహించిన విలువైన కానుక

Published by:

ర్ఆఆల్శ్రీఃఅ  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< తిరుమంగై ఆళ్వార్

dhivyaprabandham-small

బామ్మగారు కణ్ణినుణ్ చిరుత్తాంబు ప్రబంధాన్ని పఠిస్తున్నారు. వ్యాస పరాశరులు అక్కడికి వచ్చారు.

వ్యాస: నాన్నమ్మా! మీరు ఏం చేస్తున్నారు?

బామ్మగారు: వ్యాస! నేను దివ్య ప్రబంధంలోని ఒక భాగమైన ‘కణ్ణినుణ్ చిరుత్తాంబు’ పఠిస్తున్నాను.

పరాశర: నాన్నమ్మా! ఈ ప్రబంధాన్ని మధురకవి ఆళ్వార్లు రచించారు కదా?

బామ్మగారు:  అవును. బాగా గుర్తుపెట్టుకున్నావు.

వ్యాస: నాన్నమ్మా! మీరు ఆళ్వార్ల చరిత్రలను వివరిస్తున్నప్పుడు, ప్రతి ఆళ్వారు కొన్ని దివ్య ప్రబంధ పాశురాలను పాడరని మీరు చెప్పారు. దయచేసి దివ్య ప్రబంధాల గురించి చెప్తారా?

బామ్మగారు: తప్పకుండా వ్యాస. దివ్య ప్రబంధాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండటం చాలా మంచిది. మన శ్రీరంగనాథుడిని శ్రీరంగ నాచియార్ను దివ్య దంపతులని పిలుస్తారు. పెరుమాళ్ళ అనుగ్రహంతో ఆళ్వార్లు దివ్య సూరులని (పవిత్రమైనవారు) పిలవబడ్డారు. ఆళ్వార్లు పాడిన పాశురాలను ‘దివ్య ప్రబంధం’ అని పిలుస్తారు. అనేక క్షేత్రాల పెరుమాళ్ళను ఆళ్వార్లు స్తుతించి పాశురాల రూపంలో దివ్య ప్రబంధాలుగా పాడారు. వాళ్ళు స్తుతించిన ఆ క్షేత్రాలనే దివ్య దేశాలని పిలుస్తారు.

పరాశర: ఓ! చాలా బావుంది నాన్నమ్మా. మీరు చెప్పే ఈ దివ్య ప్రబంధాలు ఏమిటి నాన్నమ్మా?

బామ్మగారు: పెరుమాళ్ళ కల్యాణ గుణాలను పూర్తిగా వర్ణించడం. అంతేకాకుండా పెరియ పెరుమాళ్, తిరువేంకటేశ్వరుడు మొదలైన అర్చావతార పెరుమాళ్ళను స్తుతించడం దివ్య ప్రబంధం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

వ్యాస : కానీ వేదం ముఖ్యమని విన్నాము కదా నాన్నమ్మా? దివ్య ప్రబంధానికి వేదానికి ఏమిటి సంబంధం?

బామ్మగారు:  మంచి ప్రశ్న. ‘భగవత్ జ్ఞానం’ వేదం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. వేదాంతాన్ని వేద సారంగా భావిస్తారు. ‘వేదాంతం’ మనకి భగవానుడి దివ్య మంగళ గుణాల గురించి, తత్వశాస్త్రం మొదలైనవాటి గురించిన వివరణలు అందిస్తుంది. కానీ ఇవి సంస్కృతంలో ఉన్నాయి. ఆళ్వార్లు వేదం మరియు వేదాంతం యొక్క సారాన్ని దివ్య ప్రబంధాలలో అందమైన తమిళ భాషలో మనకందించారు.

పరాశర : ఓ! అయితే వేదానికి దివ్యప్రబంధాలకు మధ్య తేడా ఏమిటి నాన్నమ్మ?

బామ్మగారు: శ్రీవైకుంఠము నుండి భగవానుడు అయోధ్యకి శ్రీరాముడి రూపంలో దిగివచ్చినపుడు, వేదం కూడా శ్రీరామాయణం రూపంగా ప్రత్యక్షమైంది. అట్లాగే, పెరుమాళ్ళు అర్చావతార రూపంలో ఈ భూమిపైకి దిగివచ్చినపుడు, ఆళ్వార్ల పాశురాల ద్వారా దివ్య ప్రబంధ రూపంలో వేదం దిగివచ్చింది. ఇక్కడున్న మనము ఆ పరమపదనాథుడిని గ్రహించడం చాలా కష్టం. అందుకని మనము ఇక్కడే అర్చావతార రూపంలో ఉన్న పెరుమాళ్ళను సేవించుకుంటాము. అదే విధంగా, వేదాన్ని / వేదాంతాన్ని అర్థం చేసుకోవడం కష్టం. కానీ అదే జ్ఞానాన్ని ఆళ్వార్లు తమ దివ్య ప్రబంధాలలో అతి సులువుగా స్పష్టమైన రీతిలో వివరించారు.

వ్యాస: నాన్నమ్మా! అంటే మనకు వేదం ముఖ్యం కాదా?

బామ్మగారు: కాదు కాదు! వేదం మరియు దివ్య ప్రబంధం రెండూ మనకు సమానంగా ముఖ్యమే. వేదం ఎందుకు ముఖ్యమంటే అన్ని ప్రమాణాలకు వేదం మూలము. కానీ భగవత్ గుణాలను అర్థం చేసుకోవటానికి ఆస్వాదించడానికి దివ్య ప్రబంధము మనకి తగినది. అంతేకాదు, వేదంలో ఎంతో కఠినమైన సూత్రాలు వివరించబడి ఉన్నాయి. దివ్య ప్రబంధం అర్థాలను తెలుసుకుంటే ఆ కఠినమైన సూత్రాలను సులువుగా అర్ధం చేసుకోవచ్చు. అందువల్ల మన స్థితికి తగినట్టు వేదం, వేదాంతం, దివ్య ప్రబంధం వంటి వాటిని అధ్యయనం చేయాలి.

పరాశర:  దివ్య ప్రబంధ  ప్రధాన లక్ష్యం ఏమిటి నాన్నమ్మా?

బామ్మగారు: మన ఈ సంసార కష్ట సుఖాల బంధాలను తొలగించడమే కాకుండా శాశ్వతంగా పరమపదంలో ఉన్న శ్రీ మహాలక్ష్మికి,  శ్రీమన్నారాయణకి నిత్య సేవలను అందించడమే దివ్య ప్రబంధ ప్రధాన లక్ష్యం. ఆ శ్రీమన్నారాయణకు నిత్య సేవలు అందించటమే మన స్వభావం. కానీ ఈ సంసారంలో లౌకిక వ్యవహారాలలో మునిగి ఉండటం వలన ఆ విలువైన ఆనందాన్ని మనం కోల్పోతున్నాము. ఆళ్వారల దివ్య ప్రబంధం పరమపదంలో పెరుమాళ్ళను నిరంతరం సేవించే  ప్రాముఖ్యత గురించి నొక్కి చెబుతుంది.

వ్యాస: అవును నాన్నమ్మా! మీరు ఇంతకు ముందు కూడా ఈ విషయం గురించి చెప్పారు.

పరాశర: మన పూర్వాచార్యులు ఎవరు నాన్నమ్మా?

బామ్మగారు: పరాశర! మంచి ప్రశ్న. ఆళ్వర్ల తరువాత ఇక మన సాంప్రదాయంలోని అనేక ఆచార్యుల గురించి చెప్తాను. మన పూర్వాచార్యుల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. వాళ్ళు మన ఆళ్వార్ల సూక్తులను ఎలా చూచా తప్పకుండా ఆచరించి జీవించారో, వాళ్ళు వేసిన బాటలో నడుచుకోవాల్సిన అవసరము గురించి మనము తెలుసుకుందాము.

వ్యాస పరాశరులు: సరే నాన్నమ్మా! తెలుసుకోవాలని ఆతృతగా ఉంది.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : http://pillai.koyil.org/index.php/2015/02/beginners-guide-dhivya-prabandham-the-most-valuable-gift-from-azhwars/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org