బాల పాఠము – పిళ్ళై లోకాచార్యుల శిష్యులు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

  శ్రీ వైష్ణవం – బాల పాఠము

<<పిళ్ళై లోకాచార్యులు, నాయనార్

పిల్లలందరు కలిసి బామ్మగారింటికి  పిళ్ళై లోకాచార్యుల శిష్యుల గురించి వినాలని ఎంతో ఉత్సాహంతో వస్తారు.

బామ్మగారు: స్వాగతం పిల్లలు, ఎలా ఉన్నారు? నేను మీ అందరి ముఖాల్లో ఉత్సాహాన్ని చూస్తున్నాను.

వ్యాస: నమస్కారం నాన్నమ్మా, మేము బాగున్నాము, మీరు ఎలా ఉన్నారు? అవును నాన్నమ్మా! పిళ్ళై లోకాచార్యుల శిష్యుల గురించి వినాలని చాలా ఆశగా ఉంది.

బామ్మగారు: అవును పిల్లలు, మీకు వాళ్ళ గురించి చెప్పాలని నాకూ ఆశగా ఉంది. పోయిన సారి పిళ్ళై లోకాచార్యుల శిష్యుల పేర్లను చెప్పుకున్నాం గుర్తుందా వీకు? వాళ్ళ పేర్లు చెప్పగలరా?

అత్తుళాయ్: నాన్నమ్మా! నాకు గుర్తున్నాయి. కూరకుళోత్తమ దాసు, విళాంచోళ్ళై పిళ్ళై, తిరుమలై ఆళ్వారు (తిరువాయ్మోలి పిళ్ళై), మణపాక్కత్తు నంబి, కొత్తూర్ అణ్ణర్, తిరుప్పుట్కొళి జీయర్, తిరుక్కణ్ణన్ గుడి పిళ్ళై, కొల్లికావల దాస.

బామ్మగారు: బావుందమ్మా అత్తుళాయ్. ఇప్పుడు వీరి గురించి వివరంగా చెప్పుకుందాము. మొదట, కూరకుళోత్తమ దాస గురించి చెప్తాను.

పిల్లలందరు: సరే నాన్నమ్మ!

బామ్మగారు: కూరకుళోత్తమ దాసులు శ్రీరంగంలో జన్మించారు. తిరుమలై ఆళ్వారు (తిరువాయ్మోలి పిళ్ళై) ని
తిరిగి మన సంప్రదాయంలోకి  తీసుకురావడంలో వీరు చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. పిళ్ళై లోకాచార్యులకు అత్యంత సన్నిహితులు వీరు. , వారు పిళ్ళై లోకాచార్యులతో ‘తిరువరంన్ ఉల’
(ముస్లింల దాడుల సమయంలో నంపెరుమాళ్ళు శ్రీరంగం వదిలి ఎన్నో ఊర్లు తిరగాల్సి వచ్చింది) సమయంలో పిళ్ళై
లోకాచార్యులతో ప్రయాణం చేశారు. కూరకుళోత్తమ దాసులను కీర్తిస్తూ మణవాళ మామునులు “కూరకుళోత్తమ దాసం ఉదారం” (చాలా దయగల, ఔదార్యం గల వ్యక్తి అని అర్థం) అన్నారు. ఎందుకంటే వీరి కృపతో తిరుమలై ఆళ్వారు తీర్చిదిద్దబడ్డారు. చివరికి, కూరకుళోత్తమ దాసుల పట్ల కృతజ్ఞతతో తిరుమలై ఆళ్వారు వారికి శరణాగతి చేసి, ఆచార్య సేవ చేసుకుంటూ ఉండిపోయి, కూరకుళోత్తమ దాసులు పరమపదించిన తరువాతనే మరలా ఆళ్వార్తిరునగరికి వెళతారు. శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రంలో ఒక శిష్యునికి “ఆచార్య అభిమానమే ఉద్ధారకం” అని చెబుతారు. ఇది ఖచ్చితంగా కూరకుళోత్తమ దాసులకు, తిరుమలై ఆళ్వార్లకు సరిపడుతుంది. మనం కూడా పిళ్ళై లోకాచార్యుల పాద పద్మాలను స్మరించే కూరకుళోత్తమ దాసులను ఎప్పుడూ గుర్తు చేసుకుందాం.

వేదవల్లి: నాన్నమ్మా! కూరకుళోత్తమ దాసుల చరిత్ర విన్నాక ఆచార్యులను శిష్యుడు ఎలా గౌరవించాలో తెలుసుకున్నాము.

బామ్మగారు: అవును వేదవల్లి, “ఆచార్య అభిమానమే ఉద్ధారకం”  అని అందరూ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇంకొక  ముఖ్యమైన శిష్యుడి గురించి తెలుసుకుందాము. వారి పేరు విళాంచోళై పిళ్ళై.

వ్యాస: నాన్నమ్మా, వీరిని విళాంచోళై పిళ్ళై అని ఎందుకు పిలుస్తారో నాకు తెలుసు. వీరు తిరువనంతపురంలో, పద్మనాభ స్వామి ఆలయ గోపురదర్శనం చేసుకోవడానికి వెళగచెట్టు ఎక్కేవారట.

viLAnchOlai piLLai

బామ్మగారు: బాగుంది వ్యాస. తక్కువ కులంలో జన్మించిన కారణంగా, గుడిలోకి వెళ్ళనిచ్చే వారు కాదు. అందుకని, పెరుమాళ్ళ దర్శనం చేసుకోవడానికి దగ్గరలో ఉన్న ఒక వెళగ చెట్టు ఎక్కి మంగళాశాసనం చేసే వారట. పిళ్ళై లోకాచార్యుల అనుగ్రహంతో వీరు ఈడు, శ్రీ భాష్యం, తత్వ త్రయం, కొన్ని రహస్య గ్రంథాలు మొదలైనవి అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ల వద్ద నేర్చుకుంటారు.

తమ ఆచార్యులైన పిళ్ళై లోకాచార్యుల వద్ద ‘శ్రీవచన భూషణము’ నేర్చుకుంటారు. శ్రీ వచన భూషణ తాత్పర్యంలో మంచి నైపుణ్యం ఉండేది వీరికి. ఆ దివ్య శాస్త్ర తాత్పర్యం అర్థాలనే “సప్త కాదై” అనే గ్రంథములో బద్రపరచారు.

పరాశర: విళాంచోళై పిళ్ళైల ఆచార్య నిష్ఠ చాలా గొప్పగా ఉంది నాన్నమ్మా!

బామ్మగారు: అవును పరాశర! తమ ఆచార్యుని ఆదేశాన్ని పాఠించి చేసిన గొప్ప కైంకర్యాలలో తిరుమలై ఆళ్వారుని మన సంప్రదాయంలోకి తీసుకురావడం ఒకటి. తిరుమలై ఆళ్వార్లకు శ్రీ వచన భూషణ సారాన్ని బోధించమని విళాంచోళై పిళ్ళైని పిళ్ళై లోకాచార్యులు నిర్దేశిస్తారు. పిల్లలూ! ఇప్పుడు, విళాంచోళై పిళ్ళై జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన ఘట్టం గురించి మీకు చెప్పబోతున్నాను.

అత్తుళాయ్: నాన్నమ్మా, సరే నాన్నమ్మా చెప్పండి.

బామ్మగారు: మీకు వినాలని ఆశగా ఉందని నాకు తెలుసు. మీకు మంచి విషయాల గురించి తెలియజేయడం నా బాధ్యత. ఇప్పుడు, జాగ్రత్తగా వినండి,

ఒక రోజు తిరువనంతపురంలో నంబూద్రీ అర్చకులు పద్మనాభస్వామికి తిరువారాధనం చేస్తున్నారు. గర్భగుడికి మూడు ద్వారాలు ఉంటాయని మీకు తెలుసుకదా? విళాంచోళై పిళ్ళై ఆలయంలోకి ప్రవేశించారు పెరుమాళ్ళ పాదాలు కనిపించేటట్టుగా ఒక ద్వారం వద్ద నిలుచున్నారు. అది చూసి నంబూద్రీ అర్చకులు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ రోజుల్లో నిమ్నజాతి వాళ్ళకి ఆలయ ప్రవేశం ఉండేది కాదు. అందుకని, అర్చకులు సన్నిధి తలుపును మూసివేసి, ఆలయం బయటకు వెళుతుంటారు.

అదే సమయంలో, విళాంచోళై పిళ్ళై శిష్యులు కొంతమంది గుడికి వచ్చి, తమ ఆచార్యులు విళాంచోళై పిళ్ళై వారి ఆచార్యులైన పిళ్ళై లోకాచార్యుల తిరువడి చేరుకున్నారని తెలియజేస్తారు. వారికి “తిరుపరియట్టం” (ప్రసాద రూపంలో పెరుమాళ్ళ వస్త్రం), పెరుమాళ్ళు ధరించిన పూలదండలు విళాంచోళై పిళ్ళై చరమ తిరుమేని అలంకారం కోసం కావాలని అడుగుతారు.

ఇది విన్న నంబూద్రీ అర్చకులు అప్పుడు విళాంచోళై పిళ్ళైల గొప్పతనాన్ని అర్ధం చేసుకొని పెరుమాళ్ళ తిరుపరియట్టం, దండలు పంపిస్తారు.

వేదవల్లి: నాన్నమ్మా, విళాంచోళై పిళ్ళైవారి చివరి క్షణాల గురించి వింటుంటే నా రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి.

వ్యాస: అవును నాన్నమ్మా, నా కళ్ళెంబడి నీళ్ళు కారుతున్నాయి. ఈ ఘట్టంతో నిమ్న జాతి వ్యక్తిని కూడా మన సంప్రదాయం ఎంత గౌరవించిందో, కీర్తించిందో తెలుస్తోంది.

బామ్మగారు: సరే పిల్లలు, మీతో సమయం బాగా గడిచింది. మీరు ఈ రోజు మనం చెప్పుకున్న వాటన్నింటినీ గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. ఈ సారి మనం కలిసినప్పుడు తిరుమలై ఆళ్వారు (తిరువాయ్మోలి పిళ్ళై) గురించి చెప్తాను.

పిల్లలందరూ ఉత్సాహంగా చర్చించుకున్న విషయాల గురించి ఆలోచిస్తూ ఆనందంతో ఇండ్లకు వెళ్ళారు.

మూలము :http://pillai.koyil.org/index.php/2018/05/beginners-guide-pillai-lokacharyars-sishyas/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment