బాల పాఠము – పిళ్ళై లోకాచార్యులు, నాయనార్లు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<<బాల పాఠము – నంపిళ్ళై శిష్యులు

పిల్లలందరరూ కలిసి బామ్మగారి ఇంటికి వచ్చారు. బమ్మగారు తిరుప్పావై పఠింస్తూ ఉంటే చూసి, పూర్తయ్యే వరకు ఎదురుచూస్తున్నారు. బమ్మగారు పాఠం పూర్తి చేసుకొని, పిల్లలను లోపలికి రమ్మంటారు.

బమ్మగారు: పిల్లలూ! లోపలికి రండి!

వ్యాస: నాన్నమ్మా, క్రిందటిసారి మీరు వడక్కు తిరువీధి పిళ్ళైల కుమారుల గురించి చెప్తానన్నారు. వారి గురించి మాకు చెప్పరూ?

బమ్మగారు: అవును వ్యాస. ఈ రోజు మనం వడక్కు తిరువీధి పిళ్ళైవారి లోకప్రసిద్ధులైన ఇద్దరు కుమారుల గురించి మాట్లాడుకుందాము. వీరి ఆచార్యులు నంపిళ్ళై, నంపెరుమాళ్ళ అనుగ్రహంతో, వడక్కు తిరువీధి పిళ్ళైకి ఇద్దరు పుత్రులు ‘పిళ్ళై లోకాచార్యులు’, ‘అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు’ జన్మించారు. ఆ ఇద్దరు పిల్లలు రామ లక్షణుల లాగా కలిసి పెరుగి గొప్ప విద్వానులైయ్యి సంప్రదాయానికి ఎంన్నో కైంకర్యాలు చేశారు.

నంపిళ్ళై పరమపదానికి చేరుకున్న తరువాత, వడక్కు తిరువీధి పిళ్ళై మన సంప్రదాయ ప్రధాన ఆచార్యులుగా బాధ్యతను వహించారు. తమ ఆచార్యులు నంపిళ్ళైల నుండి తాను పొందిన జ్ఞానాన్ని తన కుమారులకు బోధించారు. కొంతకాలం తర్వాత వడక్కు తిరువీధి పిళ్ళై వారి ఆచార్య తిరువడిని చేరుకుంటారు. వారి తరువాత వారి కుమారుడు పిళ్ళై లోకాచార్యులు మన సంప్రదాయ ప్రధాన ఆచార్యులుగా బాధ్యతను తీసుకూంటారు.

అత్తుళాయ్: నాన్నమ్మా,  పిళ్ళై లోకాచార్యులు ఎవరో కాదు దేవ పెరుమాళ్ళని విన్నాను.

కాట్టళగియ కోయిల్లో కాలక్షేపం చేస్తున్న పిళ్ళై లోకాచార్యులు

బమ్మగారు: అవును అత్తుళాయ్, నువ్వు విన్నది నిజమే. పిళ్ళై లోకాచార్యులు ఎవరో కాదు స్వయంగా దేవ పెరుమాళ్ళే. పిళ్ళై లోకాచార్యులు తమ ఆఖరి రోజులలో జ్యోతిష్కుడిలో ఉన్నప్పుడు, నాళూర్ పిళ్ళైని పిలిచి మన సంప్రదాయానికి కాబోయే ప్రధాన ఆచార్యులు తిరుమలై ఆళ్వారు (తిరువాయ్మోలి పిళ్ళై) కి సంప్రదాయ విషయాలను బోధించమని ఆదేశిస్తారు. దేవ పెరుమాళ్ళకు మంగళాసాసం చేయడానికి తిరుమలై ఆళ్వారు కాంచీపురానికి వెళ్ళినప్పుడు, పక్కనే నిలబడి ఉన్న నాళూర్ పిళ్ళైతో దేవ పెరుమాళ్ళు నేరుగా మాట్లాడుతూ అంటారు, “నేను జ్యోతిష్కుడిలో చెప్పినట్లు, మీరు తిరుమలై ఆళ్వారుకి అరుళిచ్చెయల్ అర్థాలను ఉపదేశించాలి” అని అంటారు.

వేదవల్లి: నాన్నమ్మా, పిళ్ళై లోకాచార్యులు తమ చివరి రోజులు జ్యోతిష్కుడిలో ఎందుకు గడపాల్సి వచ్చింది? వారు శ్రీరంగంలో జన్మించలేదా?

బమ్మగారు : పిళ్ళై లోకాచార్యులు మనందరి లాభం కోసం సులభమైన తమిళ భాషలో ఆళ్వార్ల పాశురాలకు అందమైన వ్యాఖ్యానాలు వ్రాసిన ఒక గొప్ప ఆచార్యులు. సంస్కృతంలో, తమిళ భాషల్లో అందరికీ ప్రావీణ్యం ఉండదు. భాష రానివాళ్ళు కూడా మన పూర్వాచార్యుల వ్యాఖ్యానాల గురించి తెలుకోవాలనే కోరిక ఉన్నవారి కోసం పిళ్ళై లోకాచార్యులు గొప్ప దయతో అతి సులభమైన భాషలో రచించి ఉంచారు. వారి రచనలలో అతి గొప్పది ‘శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం’. మన సంప్రదాయ వివరాలను తెలియజేస్తుంది. వీరు మన ‘ప్రమాణ రక్షణం’ (మన సాంప్రదాయం జ్ఞాన పునాదిని రక్షించి పోషించుట) చేసిన ముఖ్యమైన ఆచార్యులు.

పిళ్ళై లోకాచార్యులు – శ్రీరంగం

పిళ్ళై లోకాచార్యులు మన సంప్రదాయ జ్ఞాన ధనాన్ని కాపాడటమే కాకుండా, మన సాంప్రదాయానికి మూలాధారమైన శ్రీరంగం నంపెరుమాళ్ళను కూడా పరిరక్షించారు. శ్రీరంగంలో అంతా సక్రమంగా ఉన్న రోజుల్లో, హఠాత్తుగా ముస్లింల దాడులు ఒక మంటలా వ్యాపించింది. ఈ ముస్లిం నవాబులు మన గుళ్ళలోని నిధులను దోచుకోడానికి దాడి చేయడంలో ఆరి తేరినవారు. అందుకని, అందరూ భయపడ్డారు. వెంటనే పిళ్ళై లోకాచార్యులు పరిస్థితిని తమ నియంత్రణలోకి తీసుకొని, పెరియ పెరుమాళ్ళ ఎదుట ఒక గోడను కట్టించి, ఉభయ నాచియార్లతో నంపెరుమాళ్ళను తీసుకొని దక్షిణం వైపుకి బయలుదేరుతారు. వయోవృద్ధులైనప్పటికీ తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా నంపెరుమాళ్ళతో ప్రయాణం ప్రారంభించారు. కొండలు, గుట్టలు, అడవుల గుండా ప్రయాణిస్తుండగా కొందరు దొంగలు వచ్చి నంపెరుమాళ్ళ తిరువాభరణాలను దోచుకుంటారు. కానీ, కొంత కాలం తరువాత పిళ్ళై లోకాచార్యులు వారి మనస్సులను మార్చగలుగుతారు. వాళ్ళందరూ పిళ్ళై లోకాచార్యులకు శరణాగతి చేసి దోచుకున్న సొమ్ముని తిరిగి వారికి అప్పగిస్తారు.

ఆ తరువాత, జ్యోతిష్కుడి (మధురై సమీపంలో) అనే ప్రదేశానికి చేరుకుంటారు. పిళ్ళై లోకాచార్యులు అనారోగ్యంతో బాధపడుతూ, పరమపదానికి చేరుకోవాలని నిర్ణయించుకొంటారు. తన శిష్యులలో ఒకరైన తిరుమలై ఆళ్వార్ (తిరువాయ్మోళి పిళ్ళై)ను సంప్రదాయ ప్రధాన ఆచార్యులుగా చేయాలనుకుంటారు. ఈ సమయంలోనే తిరుమలై ఆళ్వారుని తయారు చేయమని నాలూర్ పిళ్ళైని నిర్దేశిస్తారు. అప్పుడు శ్రీశైలేశుడు (తిరువాయ్మోళి పిళ్ళై) మధురై రాజు వద్ద పని చేస్తుండేవారు. కూరకులోత్తమ దాసుని, విలంచోలై పిళ్ళైని మధురకు పంపిస్తారు. చివరగా వారు తన చరమ తిరుమేనిని వదిలి, జ్యోతిష్కుడిలోనే పరమపదానికి చేరుకుంటారు. అలా పిళ్ళై లోకాచార్యులు నంపెరుమాళ్ళ రక్షణ కోసం వారి జీవితాన్నే త్యాగం చేశారు. వేలాది శ్రీవైష్ణవులు వాళ్ళ జీవితాలను నంపెరుమాళ్ళ కోసం అప్పుడు త్యాగం చేయకపోయుంటే ఈ రోజు మనం శ్రీరంగంలో నంపెరుమాళ్ళని దర్శనం చేసుకుకోగలిగే వాళ్ళం కాదు.

జ్యోతిష్కుడి – పిళ్ళై లోకచార్యులు పరమపదించిన స్థానం

పరాశర: వారు స్వయంగా దేవ పెరుమాళ్ళ అవతారం అనడంలో అతిశయోక్తి లేదు!

బమ్మగారు: అవును పరాశర. అందువల్ల దేవ పెరుమాళ్ళని మన సంప్రదాయ పెరుమాళ్ళ అని కూడా పిలుస్తారు. పిళ్ళై లోకాచార్య  ప్రమాణ రక్షణ మాత్రమే కాకుండా, వారు ప్రమేయ రక్షణం (నంపెరుమాళ్ళ రక్షణ) లో కూడా కీలక పాత్ర వహించారు. వీరు నంపెరుమాళ్ళ రక్షణకు పాటు పడి శ్రీవైష్ణవ లక్షణాన్ని మనకు ఆచరించి చూపించారు. పెరుమాళ్ళకు దృష్టి దోషం కలుగుతుందేమోనని పెరయాళ్వార్లు భయపడి ‘పల్లాండు’ పాడారు.  పిళ్ళై లోకాచార్యులు నంపెరుమాళ్ళ అర్చామూర్తిని పితృ వాత్సల్యభావంతో సంరక్షించారు. తన జీవితాన్నే త్యాగము చేయడానికి సిద్ధమైనారేే కాని, ముస్లిం ఆక్రామకులను నంపెరుమాళ్ళని తీసుకువెళ్ళనివ్వలేదు. అందువల్ల, మీరు ఈసారి పెరియ పెరుమాళ్ళ గుడికి వెళ్ళినపుడు, వేలాది శ్రీవైష్ణవుల నిస్వార్ధమైన త్యాగాన్ని గుర్తుంచుకోవాలి. వాళ్ళు మన సాంప్రదాయాన్ని, నంపెరుమాళ్ళని కాపాడి, ఈ వేళ మనమూ, మన భవిష్యత్తు తరాలవాళ్ళు ఆ ఫలాన్ని పొందగలిగేలా చేశారు. వారి ఋణము మనం ఎప్పుడూ తీర్చుకోలేము. వారికి కృతజ్ఞతగా వాళ్ళ త్యాగాలను గుర్తుంచుకొని, సంప్రదాయాన్ని గౌరవించి, ముందు తరాల వారికి ఆ విలువలను, జ్ఞానాన్ని అందించి ముందుకు తీసుకువెెెళ్ళడమే మనము చేయగలిగింది.

అత్తుళాయ్: నానమ్మ, పిళ్ళై లోకాచార్యుల తమ్ముడు అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ గురించి చెప్పరా?

nayanar
అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్

నాన్నమ్మ: నాయనార్లు మన సాంప్రదాయ సూత్రాలపై అద్భుతమైన గ్రంథాలు వ్రాశారు, వాటిలో ‘ఆచార్య హృదయం’ అతి శ్రేష్ఠమైన వీరి కృతి. వీరికున్న సాంప్రదాయ పరిజ్ఞానం, దివ్య ప్రబంధ జ్ఞానం వలన, వీరిని పెరియ వాచ్చాన్ పిళ్ళైలతో సమానంగా భావిస్తారు. నాయనార్లను గొప్ప ఆచార్యులుగా కీర్తించేవారు అందరు. అందరూ “జగత్ గురు వరానుజ – లోకాచార్యుల తమ్ముడు” అని కీర్తించేవారు. వీరి రచనలు ఆణిముత్యాల వంటివి. ఆ రచనలు లేకపోయి ఉంటే మన సాంప్రదాయంలోని నిగూఢ అర్థాలను ఈ వేళ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవికావు. మామునులు నాయనార్ల  రచనలను పొగుడుతూ పెరియ వాచ్చాన్ పిళ్ళై తరువాత నాయనార్ల వ్యాఖ్యానాలు మన సాంప్రదాయ పోషణలో కీలక పాత్ర వహించయని కీర్తించారు. నాయనార్లు పరమపదం చేరుకున్నప్పుడు, పిళ్ళై లోకాచార్యులు ఆ దుఃఖాన్ని భరించలేకపోయారు. నాయనార్ల తిరుముడిని (శిరస్సు) తన ఒళ్ళో ఉంచి విలపిస్తారు. ఈ ప్రపంచం ఒక శ్రేష్ఠమైన శ్రీవైష్ణవుడిని అతి కొద్ది కాలంలోనే కోల్పోయిందని దుఃఖిస్తారు.

వ్యాస: నాన్నమ్మా, పిళ్ళై లోకాచార్యులు, నాయనార్ల చరిత్రలు చాలా ఆసక్తికరంగాను, బాధాకరంగానూ ఉన్నాయి.

బమ్మగారు: అవును వ్యాస. మన ఆచార్యుల జీవిత చరిత్రల గురించి మాట్లాడటం మొదలుపెడితే, సమయమే తెలియదు. చీకటి పడుతోంది. పిల్లలు ఇక ఇళ్లకి వెళ్లండి. ఈ సారి మనము కలుసుకున్నప్పుడు పిళ్ళై లోకాచార్యుల శిష్యుల గురించి చెప్పుకుందాం.

పిల్లలు వడక్కు తిరువీధి పిళ్ళై, పిళ్ళై లోకాచార్యులు, అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్లు, వారి అద్భుతమైన జీవిత చరిత్రల గురించి ఆలోచిస్తూ వాళ్ళ ఇండ్లకి వెళతారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2016/09/beginners-guide-pillai-lokacharyar-and-nayanar/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment