బాల పాఠము – తిరువాయ్మోళి పిళ్ళై

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

  శ్రీ వైష్ణవం – బాల పాఠము

<<బాల పాఠము – పిళ్ళై లోకాచార్యుల శిష్యులు

పిళ్ళై లోకాచార్యుల శిష్యుల గురించి ఇంకా తెలుసుకోడానికి పిల్లలందరూ కలిసి ఆండాళమ్మ ఇంకిటి వచ్చారు. ఆవిడ వంట చేస్తూ ఒక చిరునవ్వు నవ్వారు. వంట ముగించుకొని శ్రీరంగనాథుడి ప్రసాదాన్ని పిల్లలకు పంచిపెట్టారు.

బామ్మగారు: పిల్లలూ లోపలికి రండి, పెరుమాళ్ళ ప్రసాదం తీసుకోండి. మనం చర్చించుకున్న విషయాలు మీకు గుర్తున్నాయి కదా? 

వ్యాస: నాన్నమ్మా, మనం కూరకుళోత్తమ దాసు, విళాంచోళ్ళై పిళ్ళై  గురించి చెప్పుకున్నాము. ఇంకా “ఆచార్య అభిమానమే ఉత్తారకం” గురించి కూడా నేర్చుకున్నాము.

బామ్మగారు: పిల్లలూ, మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ రోజు పిళ్ళై లోకాచార్యుల శిష్యులలో మరొకరు ‘తిరుమలై ఆళ్వార్’ గురించి తెలుసుకుందాము.

అత్తుళాయ్: నాన్నమ్మా, తిరుమలై ఆళ్వార్ అనే పేరు, వీరికి ఆళ్వార్ల తిరువాయ్మోళిపై ఉన్న మహాప్రీతి వల్ల వచ్చిందని నేను విన్నాను. నిజమేనా నాన్నమ్మా!

బామ్మగారు: అవును అత్తుళాయ్. వీరిని శ్రీశైలేశ, శఠకోప దాసు, ముఖ్యంగా తిరువాయ్మోళి పిళ్ళై అని పిలిచేవారు. నమ్మాళ్వార్ల పట్ల, వారి తిరువాయ్మోళి పట్ల ఉన్న భక్తి కారణంగా వీరికి ఈ పేరు వచ్చింది. తిరుమలై ఆళ్వార్లకు చిన్న  వయస్సులోనే పిళ్ళై లోకాచార్యుల తిరుహస్థాలతో పంచ సంస్కారం జరిగింది.  కాని కొంతకాలం తర్వాత, మన సంప్రదాయానికి దూరమై పోయి మధుర రాజ్యానికి ప్రధాన సలహాదారుడిగా సేవ చేయసాగారు.

వ్యాస: తిరుమలై ఆళ్వార్లను మళ్లీ సంప్రాదయాంలోకి ఎవరు తీసుకువచ్చారు నాన్నమ్మా?

బామ్మగారు: పిల్లలు, మీ ఆసక్తికి మిమ్మల్ని నేను మెచ్చుకోవాలి. పిళ్ళై లోకాచార్యులు తమ చివరి రోజులలో, 
కూరకుళోత్తమ దాసులతో పాటు మరికొందరు శిష్యులను పిలిచి తిరుమలై ఆళ్వార్లను సంస్కరించి మరలా సంప్రదాయంలోకి తీసుకురమ్మని నిర్దేశిస్తారు.

వేదవల్లి: నాన్నమ్మా, అయితే కూరకుళోత్తమ దాసులు ఏమి చేశారు? 

బామ్మగారు: సరే, ఒకసారి తిరుమలై ఆళ్వార్లు యదావిధిగా తమ పల్లకీలో వెళుతున్నారు. కూరకుళోత్తమ దాసు ‘తిరువిరుత్తం’ పఠిస్తుండగా వింటారు. పిళ్ళై లోకాచార్యుల తిరువడి సంబంధం వీరికి ముందే ఉన్నందున, కూరకుళోత్తమ దాసుల గొప్పతనాన్ని అర్ధం చేసుకోగలుగుతారు. తిరుమలై ఆళ్వార్లు పల్లకీ నుంచి క్రిందకు దిగి ‘తిరువిరుత్తం’ ప్రబంధ అర్ధాలను బోధించమని కూరకుళోత్తమ దాసులను వేడుకుంటారు. 

పరాశర: నాన్నమ్మా, కూరకుళోత్తమ దాసుల నుండి తిరుమలై ఆళ్వార్లు ఎలా నేర్చుకున్నారో చెప్పరా!

బామ్మగారు: కూరకుళోత్తమ దాసులు రాజభవనానికి వచ్చి తిరుమలై ఆళ్వార్లకు పాటాలు చెప్తుండేవారు. తిరుమలై ఆళ్వార్లు ఊర్ధ్వ పుండ్రం ధరించేటప్పుడు పిళ్ళై లోకాచార్యుల తనియన్ సేవించడం చూసి ఆనందిస్తారు. రాజకార్యాలలో వ్యస్థులై ఉండటం కారణంగా పాటాలకు హాజరు కాలేకపోతుంటారు. తిరుమలై ఆళ్వార్లు క్షమాపణ కోరగా, కూరకుళోత్తమ దాసులు వారిని క్షమించి తమ శేష ప్రసాదాన్ని వారికిస్తారు. ఆ ప్రసాదం స్వీకరించినప్పడి నుండి తిరుమలై ఆళ్వార్లు పరివర్తనం చెంది, పూర్తిగా భౌతిక విషయాలను విడిచి, రాజ్య భారాన్ని యువరాజుకి అప్పగించి రాజ్యాన్ని వదిలి పెట్టేస్తారు.

కూరకుళోత్తమ దాసులు తమ ఆఖరి రోజులల్లో,  తిరుమలై ఆళ్వార్లను తిరుక్కణ్ణంగుడి పిళ్ళై వద్ద తిరువాయ్మోళిని వివరంగా నేర్చుకోమని నిర్దేశిస్తారు. తరువాత, రహస్య అర్థాలను విళాంచోళై పిళ్ళై వద్ద నేర్చుకుంటారు. తిరుమలై ఆళ్వార్లను సంప్రదాయ ప్రవర్తకుడిగా నియమించి కూరకుళోత్తమ దాసుల తమ పరమపదం చేరుకుంటారు. పిళ్ళై లోకాచార్యులను ధ్యానిస్తూ తిరుమలై ఆళ్వార్లు కూరకుళోత్తమ దాసుల చరమ కైంకర్యాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.

వ్యాస: నాన్నమ్మా, ఆ పైన తిరుమలై ఆళ్వార్లు మన సంప్రాదయాన్ని నడిపించారా?

బామ్మగారు: కాదు వ్యాస. తిరుక్కణ్ణంగుడి పిళ్ళై వద్దకు తిరుమలై ఆళ్వార్లు వెళ్లి తిరువాయ్మోళి నేర్చుకోవడం ప్రారంభించారు. వీరు పాశురార్థాలను ఇంకా లోతుగా తెలుసుకోవాలని ఆశిస్తారు. అందుకని, పిళ్ళై వీరిని తిరుప్పుట్కుళి జీయర్ వద్దకు పంపుతారు. దురదృష్టవశాత్తు వీరు అక్కడికి చేరికునే ముందే జీయర్ పరమపదం చేరుకుంటారు. తిరుమలై ఆళ్వార్లు ఎంతో నిరాశ చెంది, మనస్సు బాగోలేక దేవ పెరుమాళ్ళకు మంగళాశాసనం చేసుకోవాలని అనుకుంటారు.

పరాశర: నాన్నమ్మా, రామానుజులు ఆలవందార్ల వద్దకు చేరుకునే ముందే వారు పరమపదించినట్టుగా ఉంది ఈ సంఘటన కూడా, అవునా నాన్నమ్మా?

బామ్మగారు: అవును పరాశర, వీరు దేవ పెరుమాళ్ళకు మంగళాశాసనం చేయటానికి కంచి చేరుకున్నారు; అక్కడ అందరూ వీరిని స్వాగతిస్తారు. దేవ పెరుమాళ్ళు శఠకోపంతో, మాలలతో, చందనంతో ఆశీర్వదిస్తారు. తిరుమలై ఆళ్వార్లు తిరుప్పుట్కుళి జీయర్ ను కలుకోకపోయినా, తిరువాయ్మోళి ఈడు వ్యాఖ్యానంతో పాటు అరుళిచ్చెయల్ (దివ్య ప్రబంధం) అర్థాలను కూడా ఉపశించమని నాలూర్ పిళ్ళైని దేవ పెరుమాళ్ళు ఆదేశిస్తారు.

నాలూర్ పిళ్ళై ఎంతో సంతోషిస్తారు, కానీ వయోవృద్దులు కావడంతో తిరుమలై ఆళ్వార్లకు బోధించలేనేమోనని భావించి, నాలూర్ పిళ్ళై పుత్రుడు నాలూర్ ఆచ్చాన్ పిళ్ళైని దేవ పెరుమాళ్ళు ఆదేశిస్తారు. ఈ దివ్య ఆజ్ఞ వినగానే, నాలూర్ పిళ్ళై  ఎంతో సంతోషంగా తిరుమలై ఆళ్వార్లను తన పుత్రుడు నాలూర్ వాచ్చాన్ పిళ్ళై వద్దకు తీసుకువచ్చి ఈడుతో పాటు అరుళిచ్చెయల్ అర్థాలను కూడా బోధించమని చెప్తారు. తిరునారాయణపురత్తు ఆయీ, తిరునారాయణపురత్తు పిళ్ళై ఈ విషయం గురించి తెలుసుకొని నాలూర్ వాచ్చాన్ పిళ్ళై తిరుమలై ఆళ్వార్లను ఇద్దరినీ తిరునారాయణపురానికి వచ్చి అక్కడే ఉండి కాలక్షేపం కొనసాగించుకోమని విన్నపించుకుంటారు. అలాగైతే తాము కూడా నేర్చుకోగలమని ప్రార్థిస్తారు. వారి ఆహ్వానాన్ని స్వీకరించి వారిరువురు తిరునారాయణపురంలో కాలక్షేపాన్ని కొనసాగిస్తారు. అక్కడ తిరుమలై ఆళ్వార్లు వివరంగా ఈడు ని లోతైన అర్థాలతో నేర్చుకుంటారు. తిరుమలై ఆళ్వార్ల సేవా భావానికి మెచ్చుకుని నాలూర్ ఆచ్చాన్ పిళ్ళై తమ తిరువారాధన పెరుమాళ్ళను తిరుమలై ఆళ్వార్లకు ప్రసాదిస్తారు. అలా, ఈడు 36000 పడి నాలూర్ ఆచ్చాన్ పిళ్ళై నుండి ముగ్గురు విద్వానులు – తిరుమలై ఆళ్వారు, తిరునారాయణపురత్తు ఆయీ, తిరునారాయణపురత్తు పిళ్ళై ద్వారా ప్రచారంలోకి వచ్చింది. ఆ తరువాత తిరుమలై ఆళ్వార్లు ఆళ్వార్తిరునగరికి వెళ్లి అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంటారు.

వ్యాస: ఆళ్వార్తిరునగరి నమ్మాల్వార్ల జన్మ స్థలం కదా నాన్నమ్మా? ఆళ్వార్తిరునగరి అతి దీనస్థితిలో ఉన్నప్పుడు తిరుమలై ఆళ్వార్లు పునరుద్ధరించారని నేను విన్నాను. మాకు ఆ చరిత్ర గురించి చెప్పండి నాన్నమ్మా?

బామ్మగారు: అవును వ్యాస. తిరుమలై ఆళ్వార్లు ఆళ్వార్తిరునగరికి వచ్చినప్పుడు, అది ఒక అడవిలా ఉండేది. ముస్లింల దండయాత్రల రోజుల్లో, నమ్మాళ్వార్లు ఆళ్వార్తిరునగారిని వదిలి కర్ణాటక / కేరళ సరిహద్దుల్లోకి వెళ్ళిపోతారు. ఎంతో కృషిచేసి  తిరుమలై ఆళ్వార్లు ఆ పట్టాణాన్ని, ఆలయాన్ని పునర్నిర్మించి. ఆలయ విధులను తిరిగి స్థాపించారు. మధురై రాజుల పరిపాలన సహాయంతో తిరుమలై ఆళ్వార్లు మరలా నమ్మాళ్వార్లను తిరిగి ఆళ్వార్తిరునగరికి తీసుకువస్తారు. వీరికి నమ్మాళ్వార్లన్నా, తిరువాయ్మోళి అన్నా మహా ప్రీతి చూపించేవారు. నిత్యం తిరువాయ్మోళిని పాటించేవారు, అందువల్ల వీరిని తిరువాయ్మోళి పిళ్ళై అని పిలిచేవారు. వీరు భావిష్యదాచార్య (ఎంబెరుమానార్లు) విగ్రహాన్ని తవ్వితీసి, తిరునగరికి పశ్చిమ భాగంలో, ప్రత్యేకంగా ఎంబెరుమానార్ల కోసం ఆలయాన్ని, ఆ ఆలయం చుట్టూ నాలుగు మాడవీధులని కట్టిస్తారు. ఆలయ సంరక్షణ కోసం రక్షకభటులను కూడా నియమించి అన్ని ఏర్పాట్లను కట్టుదిట్టం చేయుస్తారు. ఈ వేళ మనం చూస్తున్న ఈ ఆళ్వార్తిరునగరిని వీరు లేకుండా ఊహించుకోలేము. 

Image result for manavala mamuni

తిరువాయ్మోళి పిళ్ళై గురించి విని, అళగియ మణవాళన్ (మణవాళ మాముని సన్యాసాశ్రమానికి ముందు) ఆళ్వార్తిరునగరికి వెళ్లి, పిళ్ళై వారికి శిష్యులు అయ్యి వారికి సేవ చేసుకుంటూ అరుళిచ్చెయల్ అర్ధాలతో నేర్చుకుంటారు. తిరువాయ్మోళి పిళ్ళై తమ చివరి రోజులల్లో, తన తరువాత సంప్రదాయ ఆచార్యులు ఎవరని చింతిస్తుండగా అళగియ మణవాళన్ ఆ బాధ్యతను తాను తీసుకుంటానని మాట ఇస్తారు. ఆ మాటకి తిరువాయ్మోళి పిళ్ళై సంతోషించి, అళగియ మణవాళన్ను శ్రీభాష్యం నేర్చుకొని, తమ పూర్తి దృష్టి తిరువాయ్మోళిపైన, తిరువాయ్మోళి వ్యాఖ్యానాలపై పెట్టమని నిర్దేశిస్తారు. ఆ తరువాత తిరువాయ్మోళి పిళ్ళై పరమపదానికి చేరుకుంటారు, అళగియ మణవాళన్ వారి చరమ కైంకర్యాలను పూర్తి చేస్తారు.

తిరువాయ్మోళి పిళ్ళై తమ జీవితం మొత్తం నమ్మాళ్వార్లకి, తిరువాయ్మోళికి అంకితం చేశారు. వీరి కృషి వల్లనే మనకు ఈడు 36000 పడి వ్యాఖ్యానం అందింది, అళగియ మణవాళన్ చేత ప్రచారం చేయబడింది. కాబట్టి పిల్లలూ, ఎంబెరుమానార్లు పూర్వాచార్యులపై వారికున్న భక్తి ప్రపత్తులను మనకు కూడా ప్రాసాదించమని తిరువాయ్మోళి పిళ్ళై తిరువాడిని ప్రార్థిద్దాం.

పిల్లలందరు తిరువాయ్మోళి పిళ్ళైల గురించి చర్చించుకుంటూ ఇళ్ళకు వెళతారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2018/05/beginners-guide-thiruvaimozhip-pillai/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org


Leave a Comment