బాల పాఠము – కైంకర్యం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< బాల పాఠము – ఉత్తమ అనుష్ఠానాలు

పరాశర, వ్యాస, వేదవల్లి, అత్తుళాయ్ అందరూ కలిసి బామ్మవారి ఇంటికి వస్తారు.

బామ్మగారు: రండి పిల్లలూ. దేవుడికి పెట్టిన పండ్లను ఇస్తాను మీరు చేతులు కాళ్ళు కడుక్కోండి. ఆళవందార్ల తిరునక్షత్రం జరుపుకున్నారా?

పరాశర: అవును నాన్నమ్మ, చక్కగా జరుపుకున్నాము. ఆళవందార్ల సన్నిధిలో దర్శనం కూడా బాగా జరిగింది. అక్కడ, తిరునక్షత్రం ఉత్సవాలు చాలా బాగా చేశారు. మా నాన్నగారు ఆళవందార్ల వాళి తిరునామాలు మాకు నేర్పించారు. ఇంట్లో ఆ తిరునామాలను పఠించాము.

బామ్మగారు: చాలా మంచిది.

వేదవల్లి: నాన్నమ్మా,  మీరు క్రిందటి సారి ‘కైంకర్యం’ ప్రాముఖ్యత గురించిఅ చెప్తానన్నారు, మీకు గుర్తుందా?

బామ్మగారు: నాకు గుర్తుందమ్మా. నువ్వు గుర్తుంచుకొని అడిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. పెరుమ్మళ్ళకు, వారి భక్తులకు చేసే సేవను ‘కైంకర్యం’ అంటాము. పెరుమాళ్ళ సంతృప్తి మనం కైంకర్యం చేయాలి.

వ్యాస: పెరుమ్మళ్ళు సంతోషంపడతారంటే మేము ఎంతో ఆనందంగా కైంకర్యం చేస్తాము. కైంకర్యం ఎలా చేయాలి నాన్నమా?

బామ్మగారు: మనం కైంకర్యం మన మనస్సుతో (మానసిక కైంకర్యం), మన వాక్కుతో (వాచిక కైంకర్యం), మన శరీరంతో (శరీర కైంకర్యం) చేయవచ్చు. ఆండాళ్ నాచ్చియార్ కూడా, మనం అతడి మహిమలను పాడవచ్చని, ధ్యానించ వచ్చని, పుష్పాలు అర్పించ వచ్చని తమ తిరుప్పావై 5 వ పాశురంలో పాడి చెప్పింది. పెరుమాళ్ళ దివ్య కళ్యాణ గుణాలను స్మరించడం మానసిక కైంకర్యంలోకి వస్తుంది. పెరుమాళ్ళను, వారి భక్తుల మహిమలను కీర్తించడం, పాడటం, మాట్లాడటం, ముఖ్యంగా ఆళ్వార్ల పాశురాలను, పుర్వాచార్యుల స్తోత్రాలను సేవించడం పెరుమాళ్ళకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇవన్నీ వాచిక కైంకర్యంలోకి వస్తాయి. ఆలయ ప్రాంగణాలను, సన్నిధులను శుభ్రం చేయడం, ముగ్గుల వేయడం, పూల దండలతో అలంకరించడం, తిరువారాధనం కోసం గంధాన్ని నూరడం వంటివి శారీరక కైంకర్యంలోకి వస్తాయి. మొదట, మన ఇట్లో పెరుమాళ్ళకు సాధ్యమైనంత కైంకర్యం చేయాలి. మీ లాంటి పిల్లలు చేసిన  కైంకర్యాన్ని పెరుమాళ్ళు ఎంతో ఆనందంగా స్వీకరిస్తారు.

పరాశర: చాలా చక్కగా వివరించారు నాన్నమ్మా. ఇంట్లో మా నాన్నగారు చేసే తిరువారాధనంలో సంతోషంగా పాల్గొంటాము.

బామ్మగారు: మంచిది.

అత్తుళాయ్: నేను వేదవల్లి ముగ్గులు వేసి, పూలల్లి దండలు కడతాము.

బామ్మగారు:  విని చాలా ఆనందం వేస్తుంది అత్తుళాయ్. ఇంకొక ముఖ్య విషయమేమిటంటే, భగవానుడి కంటే భాగవతుల (భక్తుల) సేవ చేయడం ముఖ్యం. ఉదాహరణకు, లక్ష్మణుడు శ్రీ రాముడికి  కైంకర్యాలు చేసాడు, కానీ శత్రుఘ్నుడు రాముడి ప్రియమైన సోదరుడు, భక్తుడైన భరతుడికి కైంకర్యం చేశాడు. అంతేకాకుండా, నమ్మాళ్వార్లు శ్రీకృష్ణుడినే తన ఆహారం, నీరుగా భావించేవారు. కానీ మధుర కవి ఆళ్వార్లు మాత్రం నమ్మాళ్వార్లనే తమ భగవంతునిగా భావించేవారు. ఇది భగవత్ భక్తుల (భాగవతుల) గొప్పతనాన్ని చూపిస్తుంది. కాబట్టి, మనము ఎప్పుడూ వారి భక్తులకు దాసులుగా ఉండాలి.

అత్తుళాయ్: మీరు చెప్పినట్లు తప్పకుండా భగవత్ భక్తులకు (భాగవతులకు) సేవ చేసే ప్రయత్నం చేస్తాము. కానీ భాగవతులను ఎలా సేవించాలి నాన్నమ్మా?

బామ్మగారు: ఎవరైనా భాగవతులు మన ఇంటికి వచ్చినపుడు, వారికి శాష్టాంగ నమస్కారం చేయాలి,  వాళ్ళాని అన్ని సౌకర్యాలు అందజేస్తూ, వాళ్ళకి అవసరమైన సహాయం చేయాలి. మనం పెరుమాళ్ళు, ఆళ్వార్లు, ఆచార్యుల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళు చేసే కైంకర్యాలలో ఏమైన సహాయం అవసరమేమో వినమ్రంగా అడిగి తెలుసుకోవాలి. ఇలాంటి ఎన్నో సేవలు మనం భాగవతులకు చేయవచ్చు.

అత్తుళాయ్: తప్పకుండా నాన్నమ్మా.  దీని గురించి మాకు బాగా అర్థమైంది. అలాంటి అవకాశం ఏదైనా వస్తే వదులుకోము.

(మిగతా ముగ్గురు పిల్లలు కూడా ఒకే సారి “అవును” అని అంటారు)

బామ్మగారు:  పిల్లలూ ఎంతో ఆనందంగా ఉంది.

వేదవల్లి: మీరు చెప్తుంటే వింటూనే ఉండాలనిపిస్తుంది. ఇంకా చెప్పండి నాన్నమ్మ!

బామ్మగారు: కానీ ఇప్పుడు చీకటి పడింది. ఈసారి, మనం ఇంకో విషయం గురించి చర్చించుకుందాం. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్లండి.

పిల్లలు నాన్నమ్మతో చర్చించుకున్న విషయాల గురించి ఆలోచిస్తూ తమ ఇళ్ళకు సంతోషంగా వెళతారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2018/10/beginners-guide-kainkaryam/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

1 thought on “బాల పాఠము – కైంకర్యం”

Leave a Comment